శవాన్ని ఇంట్లో పెట్టుకుని పూజలు చేశారు.. చివరికి?

praveen
దేశం మొత్తం టెక్నాలజీ వెంట పరుగులు పెడుతుంటే ఇప్పటికి కూడా కొంతమంది మూఢనమ్మకాల వెంట పరుగులు పెడుతున్నారు.  ఇప్పటికీ మంత్రాలు మాయలు ఉన్నాయి అంటూ నమ్ముతున్నారు.  పూజల పేరుతో ఎన్నో దారుణాలకు కూడా పాల్పడుతున్నారు. అయితే జనాల నమ్మకానికి కూడగట్టుకున్న ఎంతోమంది బురిడీ బాబా లు పూజలు చేస్తాం అంటూ చెప్పి భారీగా డబ్బులు దండుకుంటున్న ఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయి.  అంతేకాదు గతంలో తెలంగాణలో కొంతమంది బురిడీ బాబాలు హల్ చల్ చేశారు   ఏకంగా చనిపోయినవారిని బ్రతికిస్థామని పూజలు చేయడం మొదలుపెట్టారు.  చివరికి పోలీసులు వారికి ఆట కట్టించారు.

 ఇక ఇటీవలే ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. చనిపోయిన  మహిళను బ్రతికించేది పూజలు చేశారు.  ఈ ఘటన తమిళనాడులో వెలుగులోకి వచ్చింది. తమిళనాడులోని తిరుచ్చి జిల్లాకు చెందిన మేరీ కుమార్తెలు జయంతి, జేసిందా తో కలిసి ఉంటుంది  గత వారం రోజులుగా మేరీకి అనారోగ్యంతో బాధ పడుతుంది  ఇక ఇటీవల ఉలుకు పలుకు లేకపోవడంతో ఆసుపత్రికి తీసుకెళ్లగా చనిపోయినట్లు వైద్యులు నిర్థారించారు. ఇక ఆ తర్వాత చనిపోయిన తల్లి మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చిన కూతుర్లు విచిత్రంగా ప్రవర్తించారు.

 తల్లి మీద ఉన్న ప్రేమ ఏకంగా వారిని మూఢనమ్మకాలను నమ్మేలా చేసింది. తల్లి బ్రతకాలి అంటూ రెండు మూడు రోజులుగా పూజలు చేయడం మొదలుపెట్టారు  ఇరుగు పొరుగు వారికి అనుమానం వచ్చి గమనించే సరికి అసలు విషయం తెలిసింది. దీంతో పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు అక్కడ జరుగుతున్నది చూసి ఒక్కసారిగా షాకయ్యారు  తన తల్లి బ్రతుకుతుంది అనే ఆశతో పూజలు చేస్తున్నాం అంటూ ఇద్దరు కూతుర్లు పోలీసులకు తెలిపారు. పోలీసులు  ఎంత చెప్పినా వారు మాత్రం వినిపించుకోలేదు. మా అమ్మ తల్లి బ్రతికే ఉందని త్వరలో నిద్ర లేచి వస్తుంది అంటూ పోలీసులకు చెప్పారు. ఇక వారిని ఎలాగోలా ఒప్పించిన పోలీసులు చివరికి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాగా స్థానికంగా హాట్ టాపిక్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: