చిన్నారి చైత్ర ఘటన మరవకముందే.. మరో దారుణం?

praveen
ఛీ.. ఛీ మనుషుల్లో మార్పు రావడం లేదు.. సభ్య సమాజంలో రోజురోజుకు మానవ మృగాలు పెరిగిపోతున్నారు తప్ప..  ఎక్కడ మానవత్వం ఉన్న మనుషులు మాత్రం కనిపించడం లేదు. ఇటీవలే హైదరాబాద్లో సింగరేణి కాలనీ లో ఆరేళ్ల చిన్నారీ చైత్ర దారుణమైన  అత్యాచారం హత్య ఘటన దేశ వ్యాప్తంగా ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పక్కింట్లో ఉండే రాజు అనే వ్యక్తి చిన్నారిని దారుణంగా అత్యాచారం చేసి హత్య చేశాడు. అంతేకాదు చిన్నారి మృతదేహాన్ని ఎవరికీ దొరకకుండా ఒక బట్టలో కట్టి దాచేసాడు. ఇక ఈ ఘటన సంచలనంగా మారగా నిందితుడిని ఉరితీయాలి అంటూ ప్రస్తుతం ప్రతి ఒక్కరూ డిమాండ్ చేస్తున్నారు.

 ఇలాంటి ఘటనలు మళ్లీ అసలు పునరావృతం కాకూడదు అంటూ అందరూ కోరుకుంటున్నారు. ఇక చిన్నారి చైత్ర కు జరిగిన ఘటనపై అందరూ ఎంతో విచారం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సమయంలో చిన్నారి చైత్ర పై జరిగిన అత్యాచారం హత్య ఘటన మరవకముందే మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చి సంచలనంగా మారిపోయింది. సైదాబాద్ అత్యాచార ఘటన మరువక ముందే మరో ప్రాంతంలో అత్యాచార ఘటన కలకలం సృష్టించింది. ఇటీవలే హైదరాబాద్ నగరంలోని మంగల్ హాట్ పరిధిలో ఒక బాలికపై అత్యాచారం జరిగింది.

  బాలికను సుమిత్ అనే యువకుడు రేప్ చేసినట్లు ఇటీవలే బయటపడింది. అయితే నిన్న రాత్రి 11 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. బాలిక అరుపులతో సంఘటనా స్థలానికి చేరుకున్న స్థానికులు పారిపోయేందుకు ప్రయత్నించిన సుమిత్ ను పట్టుకొని పోలీసులకు అప్పగించినట్లు సమాచారం. నిందితుడిపై పోక్సో చట్టం లోని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు జైలుకు తరలించారు. ఇక వైద్య పరీక్షల నిమిత్తం బాలికను ఆసుపత్రికి తరలించారు. ఇలా చైత్ర ఘటన మరువక ముందే మరో అత్యాచార ఘటన హైదరాబాద్ నగరంలో వెలుగులోకి రావడం సంచలనంగా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: