పెళ్ళైన కొన్నాళ్లకే అసలు నిజం బయటపడింది.. చివరికి 4 నెలల్లోనే?
ఎంతో మంచి వాళ్ళు అనుకున్న అత్తమామలు నరరూప రాక్షసులు అన్న విషయం బయటపడింది. దీంతో పెళ్లయిన కొన్నాళ్లకే చిత్రహింసలు మొదలయ్యాయి. దీంతో అత్తింటి వేధింపులు భరించలేక పెళ్లయిన 4 నెలలకే యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాదకర ఘటన మహబూబ్ నగర్ జిల్లా హన్వాడ మండలం లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పిల్లి గుండు తండాకు చెందిన సునీత కు ఏడాది మే 23వ తేదీన పెళ్లి జరిగింది. వీరన్న పేట కు చెందిన మెకానిక్ సతీష్ ను పెళ్లి చేసుకుంది. పెళ్ళి సమయంలో తల్లిదండ్రులు లక్ష రూపాయల నగదుతో పాటు కొంత బంగారం కట్నంగా ఇచ్చారు.
పెళ్ళైన కొన్నాళ్ళ వరకు బాగానే ఉన్నప్పటికీ ఆ తర్వాత అత్తమామలు అదనపు కట్నం కోసం వేధింపులు మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే తులం బంగారం విషయంలో గొడవ పడి భర్త అత్తమామ సునీతను పుట్టింటికి పంపించేశారు. ఇక ఈ విషయంపై గత వారం అటు ఊరి పెద్దల మధ్య పంచాయితీ కూడా జరిగింది. దీంతో సునీతను మళ్లీ భర్త సతీష్ తీసుకు వెళ్ళాడు. కానీ ఆ తర్వాత రోజు మళ్ళీ వచ్చి పుట్టింట్లో వదిలేసి వెళ్లిపోయాడు. కాపురానికి తీసుకెళ్లే ప్రసక్తే లేదు అంటూ చెప్పాడు. దీంతో మనస్థాపానికి గురైన సునీత ఇక తల్లిదండ్రులు పొలం పనికి వెళ్ళిన సమయంలో ఇంటికి సమీపంలో ఉన్న ఒక బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.