కడప జిల్లా చాగల మర్రి కి చెందిన అక్బర్ బాషా కుటుంబం ఆత్మహత్య చేసుకుంటా మంటూ సామాజిక మాధ్యమా ల్లో వీడియో సందేశం విడుదల చేసింది. సీఎం జగన్ మోహన్ రెడ్డి కి చేరేలా వీడియో షేర్ చేయాలని కుటుంబం ఆవేదన వ్యక్తం చేశారు. దువ్వూరు మండల ఎర్రవల్లి లొని తమ భూమిని అక్కడి వైసీపీ పార్టీ నాయకులు తమ భూమి కబ్జా చేసారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా ఎస్పీ కి ఫిర్యాదు చేస్తే మైదుకూరు రూరల్ సిఐ ని కలిస్తే న్యాయం జరుగుతుందని అన్నారని ఆ వీడియో తెలిపారు బాధితులు..
కోర్టు ఉత్తర్వు లను సైతం బేఖాతరు చేస్తున్న రూరల్ సిఐ కొండారెడ్డి... దాన విక్రయం ద్వారా తనకున్న ఒకటిన్నర ఎకరం భూమి బలవంతం గా లాక్కోవాలని వైసీపీ నాయకుడు తిరుపాల్ రెడ్డి చూస్తున్నాడు. కడప ఎస్పీ ఆదేశాలను సైతం మైదుకూరు రూరల్ పోలీసులు పట్టించుకోవడం లేదు.. నిన్నటి వరకు తమ కుటుంబాని కి న్యాయం చేస్తామన్న సిఐ కొండారెడ్డి... ప్రస్తుతం వైసీపీ పార్టీ నాయకులకు వత్తాసు పలుకు తున్నారు.. తాను చెప్పినట్లు వినక పోతే ఎన్ కౌంటర్ చేస్తామని సిఐ హెచ్చరిం చాడని అక్బర్ బాషా ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.
తన ను తీవ్రం గా బూటు కాలి తో కొట్టి తన భార్య ను స్టేషన్ నుంచి బయటికి గెంటించే సాడంటూ కన్నీరుమున్నీరు అవుతు న్నాడు. మైదుకూరు రూరల్ సిఐ కొండా రెడ్డి, వైసీపీ నాయకుడు తిరుపాల్ రెడ్డి నుంచి రక్షణ కల్పించాలని అక్బర్ బాషా కుటుంబం కోరుతోంది. 48 గంటల్లో న్యాయం చేయకపొతే తన కుటుంబం మొత్తం ఆత్మహత్యకు పాల్పడతామని అక్బర్ బాషా స్పష్టం చేశారు... తమ బాధలను అర్థం చేసుకోవాలని అక్బర్ బాషా కోరాడు. అయితే దీని పై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.