ప్రస్తుతం ప్రేమించుకోవడం ఆ తరవాత పెద్దలు ఒప్పుకోలేదని ఆ ప్రేమకు బ్రేకప్ చెప్పడం కామన్ అయిపోయింది. అయితే అలా బ్రేకప్ చెప్పే క్రమంలో ఎవరో ఒకరు దానికి ఒప్పుకోకపోవడంతో ఎన్నో దారుణాలు చోటు చేసుకుంటున్నాయి. యువకులు తమతో పెళ్లికి నిరాకరించిందని ప్రియురాలిని హత్య చేయడం...ప్రియుడు పెళ్లికి నో చెప్పాడని ప్రియురాలు ఆత్మహత్య చేసుకోవడం లాంటి ఘటనలు తరచూ చోటు చేసుకుంటూనే ఉన్నాయి. కాగా తాజాగా పెళ్లి విషయమై కూడా అలాంటి ఘటనే హైదరాబాద్ ఓ చోటు చేసుకుంది. వారికి ప్రేమకు పెద్దలు అడ్డురావడం..అంతే కాకుండా ప్రేమికుల మధ్య గొడవలు తీవ్రస్థాయికి చేరుకోవడంతో ప్రియుడు ప్రియురాలిని లెమన్ ట్రీ హోటల్ లో గత రాత్రి దారుణంగా హత్య చేసి తాను ఆత్మహత్య చేసుకున్నాడు.
కాగా తాజాగా ఈ కేసులు కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. రెండు నెలల క్రితమే సంతోషి, రాముడు ప్రేమ వివాహం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే సంతోషి రాములు ప్రేమ పెళ్లి వ్యవహారం కాస్తా పెద్దలకు తెలియడంతో గొడవలు జరిగాయి. 2 నెలల క్రితం సంతోషి కానిస్టేబుల్ ట్రైనింగ్ కోసం హైదరాబాద్ వచ్చినట్టు తెలుస్తోంది. హైదరాబాద్ లోనే ప్రస్తుతం ఉంటూ కానిస్టేబుల్ ట్రైనింగ్ తీసుకుంటోంది. రాములు కూడా హైదరాబాదులో లో కారు డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. వీరిద్దరు కడా చిన్న నాటి స్నేహితులు కావడంతో వీరి మద్య ప్రేమ చిగిరించి అది కాస్తా పెళ్లి వరకూ వచ్చింది. వీరి ప్రేమ వివాహానికి పెద్దలు ఒప్పుకోకపోవడంతో గుట్టుచప్పుడు ఇద్దరూ రెండు నెలల కిందటే పెళ్లి చేసుకుని ఒక్కట్టయ్యారు.
దాంతో ఇద్దరినీ తల్లి దండ్రులు మందలించి గ్రామంలోనే ఉంచారు. దాంతో కొద్ది రోజులుగా వీరిద్దరి మధ్య కూడా గత కొన్ని రోజుల నుంచి గొడవలు జరుగుతున్నట్టు విచారణలో తేలింది. గొడవలను పరిష్కరించుకునేందుకే ఇద్దరూ కలిసి లెమన్ ట్రీ హోటల్ కు వచ్చారు. అయితే హోటల్ లో ఇద్దరి మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో బాత్రూం కు వెళ్ళిన సంతోషినిని రాములు బ్లేడ్ తీసుకుని గొంతు కోసి హత్య చేశాడు. అనంతరం తాను కూడా అదే గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.