దారుణం.. టీవీ చూడడానికి రమ్మని పిలిచి.. గర్భవతిని చేశాడు?

praveen
రోజురోజుకు మహిళలపై జరుగుతున్న అత్యాచార ఘటనలు పెరిగిపోతున్నాయి తప్ప ఎక్కడా తగ్గిన దాఖలాలు మాత్రం కనిపించడం లేదు. నెలలు నిండని పసికందుల నుంచి పండు ముసలమ్మల వరకు అందరూ కామాంధుల బారిన  చిక్కుకుని బలి అవుతూనే ఉన్నారు. ఆడ పిల్లల పై అత్యాచారం చేసిన వారిని శిక్షించేందుకు కఠిన చట్టాలు తీసుకొచ్చినప్పటికి కామాంధుల తీరులో  మాత్రం మార్పు రావడం లేదు. కామంతో కళ్లు మూసుకుపోయి మానవ మృగాలు లాగే ప్రవర్తిస్తున్నారు. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది.

 అభం శుభం తెలియని 12 ఏళ్ల చిన్నారిని ఇక్కడ ఒక కామాంధుడు చిదిమేశాడు. మంచి వాడిలా నటించిన చివరికి లైంగిక దాడికి పాల్పడ్డాడు. అంతే కాదు అభం శుభం తెలియని ఆ పన్నెండేళ్ళ చిన్నారిని గర్భవతిని చేశాడు. చివరికి అసలు విషయం బయటకు రావడంతో ఇది కాస్త సంచలనంగా మారిపోయింది. ఘటన శ్రీకాకుళం జిల్లా జి.సిగడాం మండలం గడ్డ కంచరాం గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన 26 ఏళ్ల అనిల్ దినసరి కూలీగా పని చేస్తున్నాడు  ఇక అదే గ్రామానికి చెందిన ఏడో తరగతి చదువుతున్న బాలిక పై కన్నేశాడు.

 అయితే బాలిక కుటుంబం నిరుపేదలు కావడంతో తరచూ ఇక అనిల్ ఇంటికి ఆ బాలిక టీవీ చూడటానికి వస్తూ ఉండేది. ఈ క్రమంలోనే ఆ బాలిక పై కన్నేసిన అనిల్ మాయ మాటలతో నమ్మించి చివరకి ఆ బాలికపై అత్యాచారానికి ఒడిగట్టాడు. అంతేకాదు ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. దీంతో ఆ చిన్నారి ఈ విషయాన్ని ఎవరికీ చెప్పలేదు  ఆ తర్వాత బాలిక గర్భం దాల్చింది. అయితే శరీరంలో మార్పులు గమనించిన తల్లిదండ్రులు చివరికి ప్రశ్నించగా అసలు విషయం బయటపెట్టింది.  దీంతో నివ్వెరపోయిన తల్లిదండ్రులు వెంటనే పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: