ముందే రెండు పెళ్లిళ్లు చేసుకున్న భార్య.. అది తెలిసి పోలీస్ స్టేషన్ను ఆశ్రయించిన భర్త..
అయితే తన భార్య అంతకు ముందే రెండు పెళ్లిళ్లు చేసుకుందని తెలుసుకున్న సదరు భర్త షాక్ అయ్యాడు. ఈ విషయమై ఆమెను నిలదీశాడు. ముందే రెండు పెళ్లిళ్లు చేసుకున్న నీవు కేవలం డబ్బు కోసమే నన్ను మూడో పెళ్లి చేసుకున్నావా? అని ప్రశ్నించాడు. దీనికి బదులుగా ఆమె అతడి పై హత్యా యత్నం చేసిందట. దీంతో లబోదిబోమంటూ సదరు భర్త పోలీసులను ఆశ్రయించి తన భార్య పై ఫిర్యాదు చేశాడు. అతడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. అలాగే తిరువూరు సివిల్ కోర్టు లో తనకు తన భార్య నుంచి విడాకులు ఇప్పించాలని వెంకటేష్ ఓ పిటిషన్ దాఖలు చేశాడు.
తన ఫిర్యాదులో భార్య మరో నలుగురితో కలిసి తనపై హత్యాయత్నానికి పాల్పడిందని వెంకటేష్ పేర్కొన్నాడు. ఒకరోజు భోజనంలో విషం కలిపి తనను చంపేందుకు కూడా తన భార్య ప్రయత్నించిందని ఆయన ఆరోపించాడు. దీంతో అతని ఫిర్యాదు మేరకు పోలీసులు అతడి భార్య తో సహా నలుగురిపై సంబంధిత కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు. నిజనిజాలు త్వరలోనే బయటపెడతామని పోలీసులు మీడియాకి వెల్లడించారు. అయితే సొంత భార్య పై కేసు నమోదు చేయడం ఆసక్తికర అంశంగా మారింది.