మష్రుమ్ తో ఎప్పుడైనా ఇలాగ ఫ్రైడ్ రైస్ తయారుచేసి చూడండి....!

Sravani Manne
మష్రుమ్ లో ఉన్న ప్రోటిన్స్,దానిలో ఉన్న మంచి గుణాలు అన్ని ,ఇన్ని కావు.ఇప్పుడు కరోన కాలంలో డాక్టర్లు కూడా ఎక్కువగా మష్రుమ్ తినమని సలహా ఇస్తున్నారు. మష్రుమ్ ని ఇలా వండితే చిన్న పిల్లలు సైతం ఇష్టంగా తింటారు.ఇంకా తయారీ విదానం తెలుసుకుందాం.

 కావలసిన పదార్దాలు:

నెయ్యీ:1 టేబుల్ స్పూన్

నూనె: 2 టేబుల్ స్పూన్

జీడిపప్పు:5 పలుకులు

ఉల్లిపాయలు:1 చిన్నది

పచ్చిమిరపకాయలు:1

బటన్ మష్రుమ్:200 గ్రా

వెల్లుల్లి ముక్కలు: 1 టీ స్పూన్

క్యారెట్ :1

ఫ్రోజెన్ బీన్స్:పావు కప్పు

సోయా సాస్:1 టేబుల్ స్పూన్

పెప్పర్ పౌడర్:1 టేబుల్ స్పూన్

రెడ్ కాప్సికం:1

టమోటో సాస్: 1 టేబుల్ స్పూన్

వెనిగర్:1 టీ స్పూన్

ఉడికించిన రైస్:2 కప్పు

అల్లం పేస్టు:1 టీ స్పూన్

ఉప్పు:తగినంత

కొత్తిమీర:తగినంత


తయారి విదానం:

ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని నెయ్యీ, నూనె వేసి వేడి అయిన తర్వాత వెల్లుల్లి ముక్కలు వేసి  వేయిoచాలి.తర్వాత అల్లం పేస్టు వేసి  వేయిoచాలి.తర్వాత జీడిపప్పు పలుకులు వేసుకోవాలి.తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ వేసి కొంచం వేగాక సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి వేయాలి. తర్వాత బటన్ మష్రుమ్ వేసి మష్రుమ్లోని వాటర్ పోయే వరకు వేయిoచాలి.తర్వాత రెడ్  కాప్సికం ముక్కలుగా వేసి ఒక సారి కలిపాక,క్యారెట్ ముక్కలు వేసుకోవాలి.తర్వాత ఇందులో ఫ్రోజెన్ బీన్స్ వేసుకోవాలి.మొత్తం ఒకసారి కలిపాక సోయాసాస్,వెనిగర్ వేయాలి.వాటన్నిటిని ఒకసారి కలిపాక టమోటో సాస్ వేసి కలపాలి.తర్వాత ఉడికించిన రైస్ వేసి కలుపుకోవాలి.చివరగా పెప్పర్ పౌడర్ వేసి కలుపుకున్నాక చివరలో కొత్తిమీర వేసి సర్వ్ చేసుకోవాలి.అంతే ఎంతో రుచికరమైన మష్రుమ్ ఫ్రైడ్ రైస్ రెడీ. మష్రుమ్ తో ఎప్పుడైనా ఇలాగ ఫ్రైడ్ రైస్ తయారుచేసి చూడండి.ఈ ఫ్రైడ్ రైస్ ని మిగిలిన అన్నంతో కూడా చేసుకోవచ్చు.ఈవెనింగ్ స్నాక్స్ టైంకి చూసుకుంటే పిల్లలకి స్కూల్ నుంచి రాగానే మంచి స్నాక్స్ ఇవ్వొచ్చు.అంతే కాకుండా ఎక్కువ సమయం లేనపుడు,సరియైన కూరగాయలు అందు బాటలో లేనపుడు,  ఉదయం లంచ్ బాక్స్ లలోకి ఈజీగా తయారు చేసుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: