తెలంగాణా మటన్ కర్రీ చాలా ఈజీగా...!
మీరు ముందు కుక్కర్ ని స్టవ్ మీద పెట్టుకుని నూనె పోయండి. అది వేడెక్కిన తర్వాత కరివేపాకు ,బిరియాని ఆకు ,చెక్క ,యాలకలు ,సోపు గింజలు, లవంగాలు మరియు మరియాలు వేసి ఒక నిమిషం వేపిన తరువాత ఉల్లిపాయ మరియు పచ్చిమిర్చి వేసి కొద్దిగా ఒక నిమిషం వేయించి ఆ తరువాత అల్లం వెల్లులి ముద్ద వేయండి. అల్లం వెల్లులిని పచ్చి వాసన పోయేవరకు వేయించండి. మటన్ ముక్కలు అప్పుడు వేయాలి. ఆ తర్వాత ఉప్పు ,పసుపు ,ధనియాల పొడి ,జీలకర్ర పొడి వేసి 1 కప్పు నీళ్లు పోసి కుక్కర్ మూత పెట్టి మీడియం మంట మీద మూడు విజిల్స్ రానీయండి.
మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించండి. ఆ తరువాత కుక్కర్ మూత తీసి గరం మసాలా, కారం ,కొబ్బరి పొడి వేసి కూర దగ్గర పడే వరకు ఉడికించండి. అంతే తెలంగాణా మటన్ కర్రి రెడీ