ఆర్టీసీ బస్సులో ఉరేసుకున్న కండక్టర్.. ఎక్కడ జరిగిందంటే?

praveen
మొన్నటి వరకు కరోనా వైరస్ అందరిపై పంజా విసిరి ప్రాణాలు తీసేసింది. ఇక ప్రాణాలు కాపాడుకోవడానికి ఎంతో మంది సర్వ ప్రయత్నాలు చేసినా కొంతమంది ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి కూడా కనిపించింది. అయితే ఇక ఇప్పుడే కరోనా వైరస్ ప్రభావం తగ్గుతున్న నేపథ్యంలో అందరూ ఊపిరి పీల్చుకుంటున్నారు. ఇలాంటి సమయంలో సడన్ హార్ట్ ఎటాక్ లు ప్రతి ఒక్కరు మరింత ప్రాణ భయాన్ని కలిగిస్తున్నాయి. అంతా సంతోషంగా సాగిపోతున్న సమయంలో క్షణాలు వ్యవతిలో కుప్పకూలిపోయి ప్రాణాలు కోల్పోతున్నారు ఎంతోమంది.

 కేవలం మనదేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా కూడా ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెరమీదకి వస్తూ హాట్ టాపిక్ గా మారిపోతున్నాయి అని చెప్పాలి. ఇక మరోవైపు ఉన్మాదులుగా మారిపోతున్న మనుషులు సాటి మనిషి ప్రాణాలను తీసేస్తున్నారు. ఇక ఇవన్నీ సరిపోవు అన్నట్లుగా కొంతమంది చిన్న చిన్న కారణాలకి అక్కడితో జీవితం ముగిసిపోయింది అని భావిస్తూ చివరికి బలవన్మరణాలకు పాల్పడుతూ బలవంతంగా ప్రాణాలు తీసుకుంటున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి అని చెప్పాలి. క్షణికావేషంలో నిర్ణయాలు తీసుకొని కుటుంబాలను విషాదంలోకి నెడుతున్నారు.

 ఇక్కడ ఇలాంటిదే జరిగింది. సాధారణంగా ఆర్టిసి కండక్టర్గా ఉద్యోగం వస్తే గవర్నమెంట్ జాబ్ దక్కిందని ఎంతోమంది ఆనందపడిపోతూ ఉంటారు. కానీ ఇక్కడ కండక్టర్గా ఉద్యోగం చేస్తున్న వ్యక్తికి ఏం కష్టం వచ్చిందో చివరికి బలవన్మరణానికి పాల్పడ్డాడు. తాను పనిచేస్తున్న బస్సులోనే ఉరి వేసుకున్నాడు కండక్టర్. మెహబూబా జిల్లా తొర్రూరు ఆర్టీసీ డిపోలో మహేందర్ రెడ్డి కండక్టర్గా పనిచేస్తున్నాడు. ఇక ఇటీవల ఎప్పటిలాగానే వీధులకు వచ్చిన ఆయన రిజిస్టర్ లో సంతకం చేసి డిపోలోని బస్సుల వద్దకు వెళ్లాడు. ఎంతకి తిరిగి రాకపోవడంతో సిబ్బంది వెళ్లి చూడగా బస్సులో ఉన్న రాడుకు వేలాడుతూ కనిపించాడు.  ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: