పెళ్లిలో గొడవ.. వరుడుని దారుణంగా కొట్టిన హోటల్ సిబ్బంది?

praveen
పెళ్లి వేడుక జరుగుతుంది అంటే చాలు హడావిడి ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు . బంధు మిత్రులందరితో నిండిపోయిన కల్యాణ మండపంలో వధూవరులు ఇద్దరు కూడా పెళ్లి మండపం పై కూర్చొని పెళ్లి తంతును పూర్తి చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే కొత్త జీవితాన్ని ప్రారంభించేందుకు ఎంతో ఆశగా ఎదురు చూస్తూ ఉంటారు అని చెప్పాలి. అయితే ఇలా పెళ్లి మండపంలో మొత్తం హడావిడి ఉంటుంది అని చెప్పాలి. ఇలాంటి సమయంలోనే కొన్ని కొన్ని సార్లు చిన్న చిన్న కారణాలకి ఘర్షణలు జరగడం కూడా అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం. ఫుడ్ విషయంలో లేదా కట్న కానుకలు, మర్యాద విషయంలో కూడా ఇలాంటి గొడవలు ఎప్పుడూ పెళ్లి మండపంలో జరుగుతూ ఉంటాయి..
 ఇక ఇటీవలే ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ లో జరిగిన ఒక పెళ్లి వేడుకలో కూడా ఇలాంటిదే జరిగింది. ఏకంగా పెళ్లింటి వారికి హోటల్ సిబ్బందికి మధ్య జరిగిన గొడవ ఒకరిపై ఒకరు దాడి చేసుకునే అంతవరకు వెళ్ళింది అని చెప్పాలి. ఈ క్రమంలోనే హోటల్ కి వచ్చిన అతిధులపై హోటల్ సిబ్బంది దారుణంగా కర్రలతో దాడి చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో కాస్త ట్విట్టర్ వేదికగా వైరల్ గా మారిపోతుంది అని చెప్పాలి. ఘజియాబాద్, మసూరి ప్రాంతానికి చెందిన ఒక కుటుంబం పెళ్లి వేడుక నిర్వహించింది.

 ఇందుకోసం గోవింద్ పూరి లో ఉన్న గ్రాండ్ ఐరిస్ హోటల్ బుక్ చేసుకుంది అని చెప్పాలి. ఇక అక్కడే హోటల్లో మెహందీ వేడుక నిర్వహించారు. అయితే హోటల్లో డీజే ను అర్ధరాత్రి రెండు గంటల తర్వాత ఆపేశారు. దీంతో పెళ్లికి వచ్చిన అతిథులు అభ్యంతరం వ్యక్తం చేశారు. మరి కొంతసేపు డీజే పెట్టమని అడిగిన హోటల్ సిబ్బంది నిరాకరించారు. దీంతో హోటల్ సిబ్బందికి అక్కడికి వచ్చిన అతిథులకు మధ్య గొడవ తలెత్తింది. దీంతో చిర్రెత్తుకొచ్చిన హోటల్ సిబ్బంది ఏకంగా కర్రలతో అతిధులపై దారుణంగా దాడికి పాల్పడ్డారు. వరుడుని కూడా వదలకుండా దారుణంగా కొట్టారు. ఈ ఘటనలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు అని చెప్పాలి. ఇక దీనిపై బాధిత కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు 9 మందిని అరెస్టు చేశారు. పరారీలో ఉన్న మరికొంతమంది కోసం వెతుకుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: