భార్య మాట వినడం లేదని.. భర్త ఏం చేశాడో తెలుసా?

praveen
సాదరణంగా భార్యాభర్తల  బంధం అంటే ప్రేమానురాగాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉంటుంది అని అందరూ అంటూ ఉంటారు. అంతేకాదు అన్యోన్యతకు భార్యాభర్తల బంధం చిరునామా అని చెబుతూ ఉంటారు. కానీ ఇటీవల కాలంలో చూసుకుంటే మాత్రం భార్యాభర్తల బంధం అనేది హత్యలకు ఆత్మహత్యలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది అని చెప్పాలి. ఎందుకంటే ఎప్పుడు కష్టసుఖాల్లో తోడు నీడగా ఉంటూ అన్యోన్యంగా ఉండాల్సిన భార్యాభర్తలు పరాయి వ్యక్తుల మోజులో పడిపోయి చివరికి కట్టుకున్న వారిని దారుణంగా హతమారుస్తున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వస్తూ ఉన్నాయి.

 ఇక అదే సమయంలో భార్యాభర్తల మధ్య తలెత్తిన చిన్న చిన్న గొడవలకే మనస్థాపం చెందుతూ ఎంతోమంది అక్కడితో జీవితం ముగిసిపోయింది అని భావిస్తూ. ఇక బలవన్మరణాలకు పాల్పడుతున్న ఘటనలు కూడా నేటి రోజుల్లో కోకోల్లలుగా వెలుగు చూస్తున్నాయ్. ఇక్కడ కూడా ఇలాంటి తరహా ఘటన వెలుగు చూసింది.. భవానిపురంలో ఒక వ్యక్తి భార్య తన మాట వినడం లేదు అన్న కారణంతో మన స్థాపించింది ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం నులకపేట ప్రకాష్ నగర్ లో తన కుమార్తె దగ్గర ఉంటుంది దుర్గమ్మ. అయితే మార్బుల్ పనిచేస్తూ జీవనం సాగించే ఆమె పెద్ద కుమారుడు కళ్లెం లక్ష్మీప్రసాద్ వివాహం అయ్యి ముగ్గురు పిల్లలు ఉన్నారు.

 అయితే అతను 8 ఏళ్ళ క్రితం మొదటి భార్యని వదిలేసి భవాని అనే మహిళను రెండో పెళ్లి చేసుకున్నాడు. ఈ క్రమంలోనే  ఇటీవలే లక్ష్మీప్రసాద్ తల్లి దుర్గమ్మకు ఫోన్ చేసి తన రెండో భార్య భావాని తన మాట వినడం లేదు తాను వద్దంటున్న పనికి వెళ్తుందని చెప్పి ఎంతగానో బాధ పడిపోయాడు. అయితే అతను మద్యం సేవించి మాట్లాడుతున్నాడని తల్లి అతని మాట తీరు ద్వారా గ్రహించింది. ఇక ఆ తర్వాత గంటల వ్యవధిలోనే కోడలు భవాని అత్త దుర్గమ్మకు ఫోన్ చేసి లక్ష్మీప్రసాద్ ఇంట్లో ఉరివేసుకొని చనిపోయాడంటూ సమాచారం అందించింది. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: