సైకో మనవడు.. అమ్మమ్మను చంపి హాయిగా టీవీ చూస్తూ?

praveen
ఇటీవలి కాలంలో మనుషుల్లో మానవత్వం పూర్తిగా కనుమరుగై పోతుంది అన్న విషయం తెలిసిందే.. ఈ క్రమంలోనే మనుషులు పరాయి వాళ్ల విషయంలోనే కాదు సొంత వాళ్ల విషయంలో కూడా కాస్త అయినా జాలి దయ లేకుండా దారుణంగా వ్యవహరిస్తున్నారు. ఏకంగా సైకోలు గా మారిపోతూ సొంత వారి ప్రాణాలను గాల్లో కలిపేస్తున్న ఘటనలు ఎన్నో  వెలుగులోకి వస్తున్నాయి. ఇలాంటి తరహా ఘటనలు సభ్యసమాజాన్ని మొత్తం ఉలిక్కిపడేలా చేస్తున్నాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇటీవల చెన్నైలో కూడా ఇలాంటి ఓ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది.

 70 ఏళ్ల వృద్ధురాలుని ఆమె మనవడు దారుణంగా హతమార్చాడు.  తమ ఇంటి కోసం తాను ఇచ్చిన లక్ష రూపాయలు అప్పులు తీర్చండి అంటూ విశాలాక్షి అనే వృద్ధురాలు మనవడు సతీష్ను పదేపదే అడగడం మొదలు పెట్టింది. దీంతో సైకో గా మారిన మనవడు చివరికి దారుణంగా హతమార్చాడు. ఈ ఘటన స్థానికులను  ఒక్కసారిగా భయబ్రాంతులకు గురి చేసింది అని చెప్పాలి. వివరాల్లోకి వెళితే.. విశాలాక్షి కుమార్తె ఆమద కొత్త ఇంటిని కొనేందుకు తల్లి దగ్గర నుంచి లక్ష రూపాయలు అప్పుగా తీసుకుంది. ఇలాగే మరి కొంతమంది నుంచి కూడా అప్పుగా తీసుకుని కొత్త ఇంటిని కొనుగోలు చేసింది.
 అయితే ఇలా అప్పుగా తీసుకున్న లక్ష రూపాయలను తన తల్లికి ఇవ్వడంలో ఆలస్యమైంది. దీంతో తరచు విశాలాక్షి కూతురుని డబ్బులు ఇవ్వాలని ఒత్తిడి చేయడం మొదలుపెట్టింది. ఈ క్రమంలోనే కూతురితో గొడవపడటం మొదలుపెట్టింది విశాలాక్షి.  కొన్ని సార్లు మనవడిని కూడా తిడుతూ ఉండేది. ఈ క్రమంలోనే ఇటీవలే ఆమద ఇంట్లో లేనప్పుడు మనవడితో ఆమె మళ్ళీ గొడవ పడింది. ఇక అమ్మమ్మ తిట్టడం సహించలేకపోయాడు సతీష్. బ్లేడుతో ఆమె గొంతు కోసి  సుత్తితో ఆమెపై దాడి చేసి దారుణంగా హత్య చేశాడు. ఆమె రక్తపు మడుగులో పడి పోయి ఉండగా.. సతీష్ మాత్రం టీవీ పెట్టుకుని ఎంజాయ్ చేశాడు. ఇక బయటకు వెళ్లిన ఆమద ఇంటికి వచ్చేసరికి జరిగిన దృశ్యం చూసి షాక్ అయింది. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని సతీషు అరెస్టు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: