నరబలి : కడుపులో బిడ్డ బాగుండాలని.. ఆమె ఏం చేసిందంటే?

praveen
ప్రస్తుతం దేశం మొత్తం టెక్నాలజీ వెంట పరుగులు పెడుతూ ఉంది.. ఏదైనా కావాలంటే  అప్పట్లో లాగా ఎవరూ ఇబ్బంది పడటం లేదు.. అర చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ లో ఒక క్లిక్ చేస్తే చాలు కావాల్సింది ఇంటి ముందు కి వచ్చేస్తుంది.  ఇలాంటి ఆధునిక సమాజంలో ఒకప్పటి మూఢనమ్మకాలను ఎవరు నమ్మడం లేదు అని చెప్పాలి. కానీ ఇప్పటికి కూడా  దెయ్యాలు భూతాలు ఉన్నాయ్ అని గుడ్డిగా నమ్ముతూ బురిడీ బాబాల చేతిలో మోసపోతూనే ఉన్నారు ఎంతోమంది. అంతేకాదు నరబలి ఇస్తే మంచి జరుగుతుందని భావించి దారుణాలకు పాల్పడేందుకు కూడా సిద్ధమవుతున్న వారు ఉన్నారు.

 ఈ క్రమంలోనే ఇక ఇలాంటి తరహా ఘటనలు వెలుగులోకి వచ్చి ప్రతి ఒక్కరిని అవాక్కయ్యేలా చేస్తూ ఉన్నాయి అని చెప్పాలి. ఇక్కడ ఇలాంటిదే జరిగింది. కడుపులో పెరుగుతున్న బిడ్డ బాగుండాలంటే నరబలి కావాలి అంటూ ఆమెకి ఎవరో చెప్పారు. దీంతో ఏకంగా అక్క కొడుకుని దారుణంగా నరబలి ఇచ్చేందుకు కూడా సిద్ధమైంది. ఒళ్ళు గగుర్లు పొడిచే ఈ దారుణమైన ఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి. అమ్రోహ జిల్లా మలక్ పూర్ గ్రామ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది.

 రమేష్ కుమార్  సరోజాదేవి దంపతులకు  సంతానం లేరు. అయితే మూడు సార్లు పిల్లలు పుట్టినట్లే పుట్టి చనిపోయారు. ఇటీవలే ఆమె నాలుగో సారి గర్భం దాల్చింది ఆమె. ఈసారి కూడా పిల్లలు పుట్టి చనిపోతారు ఏమో అని ఆ మహిళ ఎంతగానో భయపడిపోయింది. ఈ క్రమంలోనే కడుపులో ఉన్న బిడ్డకు ఎలాంటి అపాయం లేకుండా ఉండేలా   మూఢనమ్మకాలతో ఒక తాంత్రికుడునీ కలిసింది. ఇక ఎవరినైనా బలి దానం చేస్తే మీ బిడ్డకు ఏమీ కాదని ఆ తాంత్రికుడు ఉచిత సలహా ఇచ్చాడు. దీంతో 18 నెలల వయసున్న అక్క కుమారుడిని నరబలి ఇచ్చారు. మృతదేహం ముక్కలు ముక్కలు చేసి చెరుకుతోటలో పడేశారు. బాలిక తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు  కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: