పుట్టినరోజు వేడుక.. కడుపుకోత మిగిల్చింది?
విస్సన్నపేట మండలంలో ఎస్సీ వాడలో ఈ ఘటన జరిగింది. గ్రామానికి చెందిన శివ, బన్ను దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఇక వీరిలో తేజస్విని గత ఏడాది నుంచి సత్తుపల్లి లో ఉన్న అమ్మమ్మా వద్దే ఉంటుంది. శివ సోదరులు రవికి ముగ్గురు కుమార్తెలు. ఇక వీరిలో పెద్ద కుమార్తె పుట్టినరోజు వేడుకను ఘనంగా నిర్వహించాలని కుటుంబ సభ్యులు అనుకున్నారు. ఇక దీనికి సంబంధించి బంధు మిత్రులందరికీ కూడా ఆహ్వానించి అన్ని ఏర్పాట్లు చేశారు. ఇక శివ తన కూతురు తేజస్వినిని కూడా తీసుకు వచ్చాడు. ఇక రోజంతా అక్కడున్న వారందరి తో కూడా ఎంతో సంతోషంగా ఆడుకున్న ఆ చిన్నారి ముద్దు ముద్దు మాటలతో అందరి దృష్టిని ఆకర్షించింది
ఇక పుట్టినరోజు వేడుక జరుగుతున్న సమయంలో తల్లి చేతిలో గోరుముద్ద తింటూ ఆడుకుంది ఆ చిన్నారి. ఇదే సమయంలో విధి ఆ చిన్నారి ఆనందాన్ని చూసి ఓర్వ లేక పోయింది. ఇక ప్రమాదవశాత్తు తేజస్విని అప్పుడే కాచి వేడి చేసిన సాంబార్ గిన్నెలో పడింది. అయితే వెంటనే గుర్తించిన కుటుంబసభ్యులు హుటాహుటిన చిన్నారి ని బయటకి తీసి ఆస్పత్రికి తరలించారు. చివరికి మృత్యువుతో పోరాడుతూ ఆ చిన్నారి కన్నుమూసింది. అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురు ఇక లేదు అన్న విషయాన్ని జీర్ణించుకోలేక పోయినా తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు.