గుడ్ న్యూస్.. తగ్గనున్న ఉల్లి ధర?

Purushottham Vinay
దేశంలోని ఉల్లిపాయ వినియోగదారులకు అనువైన ధరకు ఉల్లిపాయలను అందుబాటులో ఉంచడానికి కేంద్ర ప్రభుత్వం డిసెంబర్ 8, 2023 నుంచి మార్చి 31, 2024 వరకు ఉల్లిపాయల ఎగుమతిని నిషేధించింది.ఖరీఫ్ పంట రాక ఆలస్యం, ఎగుమతి చేసిన ఉల్లి నాణ్యత, టర్కీ, ఈజిప్ట్, ఇరాన్ వంటి దేశాలు విధించిన వాణిజ్య, వాణిజ్యేతర ఆంక్షలు వంటి ప్రపంచ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం ఈ మంచి నిర్ణయం తీసుకుంది. అయితే ఈ పరిణామాల వల్ల రైతులపై ప్రభావం పడకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం ధరల స్థిరీకరణ నిధి కింద రైతుల నుంచి నిరంతరం ఉల్లి పాయని కొనుగోలు చేస్తోంది.ఇక ఈ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రిజర్వ్ స్టాక్‌గా ఏడు లక్షల టన్నుల ఉల్లిపాయలను కొనుగోలు చేయాలని ప్రభుత్వం NCCF, NAFED రెండింటినీ కూడా కోరింది. ఇప్పటి దాకా దాదాపు 5.10 లక్షల టన్నుల ఉల్లిని కొనుగోలు చేయగా, మిగిలిన కొనుగోళ్లు కొనసాగుతున్నాయి.



బహిరంగ మార్కెట్ విక్రయాలు ఇంకా వినియోగదారులకు నేరుగా రిటైల్ విక్రయాల ద్వారా ప్రభుత్వం సేకరించిన ఉల్లి పాయని మార్కెట్‌లో అధిక ధరలకు విక్రయిస్తున్నారు. స్టాక్ నుంచి తీసిన 2.73 లక్షల టన్నుల ఉల్లిపాయలలో సుమారు 20,700 MT ఉల్లి పాయలని మొత్తం 213 నగరాల్లోని రిటైల్ వినియోగదారులకు 2,139 రిటైల్ కేంద్రాల ద్వారా విక్రయించారు. ఇక ప్రభుత్వం జోక్యాల కారణంగా ఉల్లి అఖిల భారత సగటు రిటైల్ ధర నవంబర్ 17న కిలో రూ.59.9 నుంచి డిసెంబర్ 8న కిలో రూ.56.8కి తగ్గింది.అక్టోబరు 29 వ తేదీన ప్రభుత్వం ఉల్లిపాయల ఎగుమతులకు, అదే సమయంలో ఉల్లిపాయ నిల్వలను ఉపయోగించుకోవడానికి టన్నుకు US$800 కనీస ఎగుమతి విలువను విధించడం జరిగింది. ఇక ఈ ఎగుమతి విలువ ఉల్లి ఎగుమతుల పరిమాణాన్ని తగ్గించడంలో ప్రభావవంతంగా ఉన్నప్పటికీ ప్రపంచ పరిస్థితులు ఇంకా అలాగే ఖరీఫ్ పంటలో జాప్యం కారణంగా ఉల్లి ఎగుమతులనేవి పెద్ద మొత్తంలో కొనసాగాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: