ఇందులో పెట్టుబడి పెడితే ప్రశాంతమైన జీవితం మీ సొంతం?

Purushottham Vinay
మనం ఏదైన జాబ్ చేస్తున్నప్పుడే రిటైర్మెంట్ ప్లాన్స్‌ను బాగా ప్లాన్ చేసుకుంటే.. వృద్దాప్యం వచ్చాకా ఎలాంటి సమస్యలు లేకుండా జీవితాన్ని చాలా కూల్‌గా ఎలాంటి ఇబ్బందులు లేకుండా కంప్లీట్ చేయవచ్చు.ఇక పోస్ట్ ఆఫీస్ పథకాల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.ఇవి కూడా ఇక బ్యాంకుల లాగానే తక్కువ పెట్టుబడితో అధిక రాబడిని అందజేస్తున్నాయి. వాటిలో కొన్ని పోస్టాఫీస్ పధకాలు అయితే జనాలకు బ్యాంకుల కంటే మంచి లాభాలను అందిస్తున్నాయి. అందులో ఒకటి రికరింగ్ డిపాజిట్ అనే పథకం.ఇక ఈ పధకంలో మీరు ప్రతీ నెలా కూడా రూ.10 వేలు డిపాజిట్ చేస్తే.. మెచ్యూరిటీ సమయానికి దాదాపు రూ. 16 లక్షల దాకా డబ్బుని పొందొచ్చు. ఈ రికరింగ్ డిపాజిట్‌లో డిపాజిట్ చేసిన సొమ్ముపై మీకు దాదాపు 5.8% వడ్డీ కూడా లభిస్తుంది. ఇక కాంపౌండింగ్ మొత్తం ద్వారా ఈ వడ్డీ ప్రతి అనేది మూడో నెలలకి యాడ్‌ అవుతుంది. దీనిపై వచ్చే రిటర్న్స్ మీద మీకు ఎటువంటి రిస్క్ ఉండదు.


కేవలం రూ. 100తో మీరు ఈ ఖాతాను తెరవచ్చు. అలాగే ఇందులో మీరు ఎంతైనా కూడా డిపాజిట్ చేయవచ్చు. ఇక ఈ పథకంలో మీరు మొత్తం 10 సంవత్సరాల పాటు పెట్టుబడి పెట్టాలి.ఇక ప్రతీ నెలా మీరు రూ. 10 వేలు పెట్టుబడి పెడుతూ మొత్తం 10 సంవత్సరాల పాటు ఇలా ఇన్వెస్ట్ చేస్తే.. ఇక లెక్క ప్రకారం ఏడాదికి లక్షా 20 వేల చొప్పున మీరు పెట్టే పెట్టుబడి 10 ఏళ్లకు రూ. 12 లక్షలు అవుతుంది. ఇక ఈ మొత్తానికి మీరు 5.8 శాతం వడ్డీ రేటుతో మీరు రూ.16,15,721 డబ్బుని పొందొచ్చు. ఒకవేళ మీరు రూ. 10 వేలు డిపాజిట్ చేయలేకపోయినట్లయితే..నెలకు రూ. 3 వేలు పెట్టుబడి పెట్టుకున్న 10 సంవత్సరాలలో దాదాపు 5 లక్షలకు వరకు సంపాదించవచ్చు.కాబట్టి ఈ పథకం పై ఆసక్తి ఉన్న వారు మీ దగ్గర్లోని పోస్ట్ ఆఫీస్ కి వెళ్లి ఈ పథకం గురించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: