ఇక ఈపీఎఫ్వో సభ్యులకు చాలా ఎక్కువ పెన్షన్ ఎంచుకునే ఆప్షన్ ఇవ్వాలని ఈమధ్య సుప్రీం కోర్టు ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే.సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో ఈపీఎఫ్ఓ అధిక పెన్షన్ కోసం అర్హతలకు సంబంధించి మార్గదర్శకాలను కూడా రిలీజ్ చేసింది. ఉన్నత న్యాయస్థానం తీర్పుకు అనుగుణంగా అధిక పెన్షన్ పొందడానికి ఈపీఎఫ్వో సభ్యులకు నిబంధనలు ఇంకా అలాగే షరతులను జారీ చేసింది. అధిక పెన్షన్ కోసం ఎలా అప్లై చేసుకోవాలో కూడా తెలిపింది. అయితే సుప్రీం కోర్టు తీర్పు తర్వాత ఈపీఎఫ్వో చందాదారులు అధిక పెన్షన్కు అర్హులని ఈపీఎఫ్వో ఓ సర్క్యూలర్ ని జారీ చేసింది. అయితే పోర్టల్ లింక్లో ఇంతకుముందు దరఖాస్తులు రిజెక్ట్ చేయబడిన ఉద్యోగుల కోసం మాత్రమే ఈ ధ్రువీకరణ దరఖాస్తు ఫారమ్ అందుబాటులో ఉంటుంది. సెప్టెంబరు 1, 2014 కంటే ముందు పదవీ విరమణ చేసిన ఉద్యోగులు మాత్రమే పెన్షన్ కోసం అప్లై చేసుకోవడానికి అర్హులు. మార్చి 3 దాకా తమ దరఖాస్తులను అప్లోడ్ చేసుకోవచ్చు. నవంబర్ 4, 2022 నాటి తీర్పుకు సంబంధించి సుప్రీం కోర్టు దీని అమలుకు సంబంధించి ఈపీఎఫ్వో ప్రాథమిక ఉత్తర్వు డిసెంబర్ 29, 2022న జారీ చేయడం జరిగింది.
ఇక ఇంతకు ముందు అప్లికేషన్స్ తిరస్కరించిన వారికి అధిక పెన్షన్ ఆప్షన్ను అందించాలని పేర్కొంటూ ఈపీఎఫ్వో ఉత్తర్వు విడుదలైంది. అయితే పోర్టల్లో తీర్పులోని పేరా 44 (ix)లో ఉన్న ఆదేశాలకు అనుగుణంగా వెరిఫికేషన్ కసం దరఖాస్తును దాఖలు చేయడానికి యూనిఫైడ్ పోర్టల్ మెంబర్ ఇంటర్ఫేస్ ఆన్లైన్ ఫెసిలిటీ అందుబాటులో ఉంటుంది.ఇక అర్హులైన ఈపీఎస్ సభ్యులు సంబంధిత ప్రాంతీయ ఈపీఎఫ్ఓ ఆఫీస్ కి వెళ్లి, అవసరమైన డాక్యుమెంట్స్ సమర్పించాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన నిబంధనలు కూడా తప్పకుండా పాటించాల్సి ఉంటుంది.వెరిఫికేషన్ కోసం దరఖాస్తు ఫామ్పైప ప్రభుత్వ నోటిఫికేషన్లో ఆదేశించిన విధంగా డిస్క్లెయిమర్ అనేది ఉండాలి. అలాగే పీఎం నుంచి పెన్షన్ నిధులకు డబ్బులు సర్దుబాటు అవసరమయ్యేలా ఉంటే, పెన్షనర్ స్పష్టమైన సమ్మతి కూడా కావాల్సి ఉంటుంది. మినహాయింపు పొందిన పీఎఫ్ ట్రస్ట్ నుంచి ఈపీఎఫ్వో పెన్షన్ నిధులకు ఫండ్ను బదిలీ చేసిన సందర్భంలో, ట్రస్టీ అండర్టేకింగ్ సబ్మీట్ చేయబడుతుంది.