ప్రస్తుత కాలంలో ఏటీఎమ్ కార్డు లేని వారు ఎవరూ ఉండరు. బ్యాంకింగ్ వ్యవస్థ విస్తృతి పెరగడం ఇంకా అలాగే ప్రభుత్వాలు కూడా సంక్షేమ పథకాల మొత్తాన్ని నేరుగా బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తుండడంతో ప్రతీ ఒక్కరూ కూడా బ్యాంక్ ఖాతా తీస్తున్నారు.ఇంకా అలాగే దీనికి తోడు ఏటీఎమ్ కార్డుల వినియోగం కూడా చాలా భారీగా పెరిగింది. అయితే డెబిట్ కార్డ్లు కేవలం డబ్బులు తీసుకోవడానికి ఇంకా షాపింగ్ చేయడానికి మాత్రమే కాదు దాంతో పాటు ఉచిత బీమా పొందే అవకాశం కూడా ఉందట. ఇక చాలా మందికి వీటిపై సరైన అవగాహన లేకపోవడంతో ఈ సదుపాయాన్ని వినియోగించుకోలేరు.ఇక డెబిట్ కార్డు ఉన్న వారికి ఎంత బీమా ఉంటుంది.? ఇంకా అలాగే దీనిని ఎలా క్లైమ్ చేసుకోవాలి.? వంటి పూర్తి వివరాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.బ్యాంక్ జారిచేసిన డెబిట్ కార్డ్ ఉన్న కస్టమర్లు ఉచితంగా ప్రమాద బీమను పొందడం జరుగుతుంది. ఇక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెబ్సైట్ ప్రకారం.. కార్డు ఉన్న వారికి పర్సనల్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ ఇంకా అలాగే పర్సనల్ ఎయిర్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ బీమాని అందిస్తారు.
ఇక ఈ బీమా కార్డుల రకాలను బట్టి అది మారుతుంది. ఎస్బీఐ గోల్డ్ మాస్టర్ లేదా వీసా కార్డ్ ఉంటే అతనికి మొత్తం రూ. 2 లక్షల భీమా లభిస్తుంది.అయితే బ్యాంక్ ప్రకారం, ప్రమాదం జరిగిన తేదీ నుంచి గత 90 రోజులలో ఒకసారి కార్డును ఉపయోగించినప్పుడు ఈ బీమా అనేది వర్తిస్తుంది.దీనికి ఎవరు అర్హులంటే.. ఒక వ్యక్తి కనీసం 45 రోజుల పాటు ప్రభుత్వ లేదా ప్రైవేటు బ్యాంకుకు చెందిన ఏటీఎమ్ను వాడితే బీమా పొందడానికి అర్హుడు. ఇక ఈ సమయం బ్యాంకుల ఆధారంగా మారుతుంది. అలాగే క్లాసిక్ కార్డ్పై రూ.లక్ష ఇంకా ప్లాటినం కార్డుపై రూ.2 లక్షలు, సాధారణ మాస్టర్ కార్డ్పై రూ.50 వేలు అలాగే ప్లాటినమ్ మాస్టర్ కార్డ్ ఇంకా వీసా కార్డ్లపై రూ.5 లక్షలు పొందవచ్చు. అలాగే వీసా కార్డుపై 1.5 నుంచి 2 లక్షల రూపాయల వరకు బీమా కవరేజీ అందుతుంది. ఇక ప్రధాన్ మంత్రి జన్-ధన్ యోజన కింద, వినియోగదారులు రూపే కార్డ్ ఇన్సూరెన్స్పై రూ. ఒకటి నుంచి రెండు లక్షల దాకా బీమా కవరేజీని కూడా పొందుతారు.