పంచదార: ఎగుమతులపై నిషేధం గడువు పెంపు?

Purushottham Vinay
పంచదార ఎగుమతులపై విధించిన నిషేధాన్ని భారత ప్రభుత్వం పొడగించింది. ఈ నిషేధం వచ్చే ఏడాది అక్టోబర్‌ నెల వరకు అమలులో ఉంటుంది.ఇండియన్ మార్కెట్‌లో ధర పెరుగుతున్న దృష్ట్యా పంచదార ఎగుమతులను గత ఏడాది జూన్ 1 నుంచి ఈ ఏడాది అక్టోబర్ 31 వరకు కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. ఈ నిర్ణయం మన దేశంలో ద్రవ్యోల్బణాన్ని అరికట్టేందుకు ఉపయోగపడుతుందని కేంద్రప్రభుత్వం భావిస్తున్నది. గోధుమలపై విధించిన ఎగుమతి నిషేధం కూడా అమలులో ఉన్నది.రికార్డు స్థాయిలో చక్కెర ఎగుమతి నేపథ్యంలో ధరల పెరుగుదల కనిపించింది. ప్రపంచంలో పంచదార ఉత్పత్తిలో భారతదేశం అతిపెద్ద దేశం కాగా, బ్రెజిల్ తర్వాత రెండో అతిపెద్ద ఎగుమతిదారుగా నిలిచింది. బంగ్లాదేశ్, ఇండోనేషియా, మలేషియా, దుబాయ్ దేశాలు మన వద్ద ఉత్పత్తయ్యే చక్కెరను అత్యధికంగా కొనుగోలు చేస్తున్నాయి. గత ఏడాది దేశం పెద్ద మొత్తంలో చక్కెరను ఎగుమతి చేసింది. గతేడాది 60 లక్ష మెట్రిక్‌ టన్నుల (ఎల్‌ఎంటీ) వరకు ఎగుమతి చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా.. 70 ఎల్‌ఎంటీ ఎగుమతైంది.


ఈ ఏడాది కూడా షుగర్ మిల్లుల నుంచి 82 ఎల్‌ఎంటీల చక్కెర ఎగుమతి జరిగింది. ఈ ఏడాది పంచదార ఎగుమతి ఎన్నడూ లేనంతగా నమోదవడం విశేషం.ఈ సీజన్‌లో మన దేశంలో 35 మిలియన్ టన్నుల చక్కెర ఉత్పత్తి కాగా, 27 మిలియన్ టన్నులను వినియోగించింది. గత సీజన్‌లో దాదాపు 8.2 మిలియన్ టన్నుల నిల్వలతో కలిపి 16 మిలియన్ల మిగులు ఉన్నట్లు గణాంకాలు చెప్తున్నాయి. చక్కెర ఎగుమతులను మిగులుగా ఉన్న 16 మిలియన్లకు పరిమితం చేయాలనే ప్రభుత్వ ప్రణాళిక చాలా ముందు జాగ్రత్తగా కనిపిస్తున్నది.అలాగే, గోధుమలపై విధించిన నిషేధం ఇంకా కొనసాగుతున్నది. పెరుగుతున్న గోధుమల ధరలను దృష్టిలో పెట్టుకుని ఈ ఏడాది మేలో వాటి ఎగుమతులపై భారత ప్రభుత్వం నిషేధం విధించింది. దేశీయంగా పెరుగుతున్న ధరలను నియంత్రించే చర్యల్లో భాగంగా గోధుమల ఎగుమతులపై ఇండియా ఆంక్షలు పెట్టింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: