ఆధార్: న్యూ రూల్.. ఇక వాటికి కూడా లింక్ కంపల్సరీ?

Purushottham Vinay
ఇక ఇప్పుడు ప్రతి ఒక్కదానికి కూడా ఆధార్ తప్పనిసరి అయ్యింది. ఇంకా బ్యాంక్ లావాదేవీల నుంచి నిత్యావసర సరుకుల వరకూ అన్నీ కూడా ఆధార్ మీద నడుస్తున్నాయి.అలాగే ఆధార్ కార్డ్‌లో ఇచ్చిన సమాచారంతో మనందరికీ పూర్తిగా అప్‌డేట్ కావడం అనేది చాలా ముఖ్యం.ఇక భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ ఆధార్‌కు సంబంధించిన అన్ని రకాల అప్‌డేట్‌లను ఎప్పటికప్పుడు కూడా అందజేస్తూనే ఉంటుంది..ఇప్పుడు ఇక ఆధార్‌కు సంబంధించిన మోసాన్ని అరికట్టడానికి uidai ధన్సు ప్లాన్‌ను తీసుకువస్తోంది.ప్రస్తుతం uidai అనేది జనన మరణ డేటాను ఆధార్‌తో లింక్ చేయాలని నిర్ణయించింది. దీని కింద ఇప్పుడు అప్పుడే పుట్టిన పిల్లలకు తాత్కాలిక ఆధార్ నంబర్ కూడా జారీ చేయబడుతుంది, ఇంకా ఆ తరువాత అది బయోమెట్రిక్ డేటాతో అప్‌గ్రేడ్ చేయబడుతుంది.మరణాల నమోదు రికార్డును కూడా ఆధార్‌ కార్డ్ తో అనుసంధానిస్తారు, తద్వారా ఈ నంబర్‌ల దుర్వినియోగాన్ని ఈజీగా నిరోధించవచ్చు. ఈ కారణంగా ఇప్పుడు ప్రతి వ్యక్తి పుట్టుక నుండి మరణం వరకు కూడా డేటా బేస్‌కు జోడించబడుతుంది.



ఇంకా అలాగే పుట్టిన బిడ్డ నుంచి వారి కుటుంబం ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను పొందేలా చేస్తుంది. దీని వల్ల సామాజిక భద్రత ప్రయోజనాలు ఇంకా ఎవరూ కోల్పోరు.ఇంకా అదేవిధంగా డెత్ డేటాతో ఆధార్‌ను లింక్ చేయడం ద్వారా నేరుగా బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (డిబిటి) పథకం దుర్వినియోగం అనేది నిరోధించబడుతుంది.. ఆ మరణించిన వ్యక్తి ఆధార్ కార్దులను వాడుతున్నారనే కేసులు ఇటీవల మనకు చాలానే వినిపించాయి. దాని పై సీరియస్ అయిన అధికారులు ఇక త్వరలో 2 పైలట్ ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు.ఇంకా అలాగే మరోవైపు UAIDAI కూడా జీరో ఆధార్‌ను కేటాయించాలని యోచిస్తోంది. దీంతో నకిలీ ఆధార్ నంబర్ అనేది జనరేట్ కాదు.. అంటే ఎలాంటి ఫోర్జరీ కూడా ఉండదు. ఇక దీని ప్రకారం ఒక వ్యక్తికి ఒకటి కంటే ఎక్కువ ఆధార్ నంబర్లు అనేవి కేటాయించబడవు. పుట్టిన ఇంకా నివాస లేదా ఆదాయ రుజువు లేని వ్యక్తులకు జీరో ఆధార్ నంబర్ అనేది ఇవ్వబడును..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: