గుడ్ న్యూస్.. ఆ ఉద్యోగులకు 365 రోజులు పెయిడ్ లీవ్స్!

Purushottham Vinay
ఇక సంస్థ కోసం పని చేసే ఉద్యోగుల సంక్షేమం ఇంకా అలాగే భద్రత కోసం పలు సంస్థలు కీలక నిర్ణయాలను తీసుకుంటున్నాయి. ఉద్యోగుల శ్రేయస్సు కోసం మరిన్ని వెసులుబాటులు కూడా కల్పిస్తున్నాయి. అలాగే ఇక ఇప్పటికే పలు సంస్థలు ప్రత్యేక ఫాకెజీలను కూడా అందిస్తున్నారు.తాజాగా -కామర్స్ సంస్థ మీషో కంపెనీ మరో అడుగు ముందుకేసింది. తమ సంస్థ ఉద్యోగులకు వేతనంతో కూడిన365 రోజులు లీవ్ కూడా ఇచ్చేందుకు నిర్ణయించుకుంది.ఉద్యోగుల భద్రత ఇంకా అలాగే సంక్షేమమే లక్ష్యంగా ‘మీకేర్‌ అనే కార్యక్రమానికి మీషో శ్రీకారం చుట్టింది. ఈ అన్‌లిమిటెడ్‌ లీవ్‌ పాలసీ ద్వారా ఉద్యోగులు గరిష్ఠంగా 365 రోజుల వరకు కూడా సెలవు తీసుకునేలా నిబంధనలు రూపొందించింది. ఇక అంతేకాకుండా ఆ సెలవు కాలంలో కూడా డబ్బులు ఇచ్చేందుకు కంపెనీ నిర్ణయించింది. సంస్థలో పని చేస్తున్న ఉద్యోగి లేదా వారి కుటుంబంలోని ఎవరైనా కానీ తీవ్ర అనారోగ్యానికి గురై.. తరచూ చికిత్స అవసరమైన వారి విషయంలో ఈ లీవ్స్ అనేవి ఇవ్వనున్నారు. ఇక అంతే కాకుండా వ్యక్తిగత లక్ష్యాలను సాధించుకునేందుకు కూడా ఈ లీవ్స్ ను ఉపయోగించుకునేలా సవరణలు చేసినట్లు సమాచారం తెలుస్తుంది.


ఇంకా అలాగే సంస్థలో పని చేసే ఉద్యోగి అనారోగ్యానికి గురైతే సెలవు కాలం మొత్తానికి కూడా వారు డబ్బులు చెల్లిస్తారు. అయితే ఆ ఉద్యోగి ఇంట్లో ఎవరైనా అనారోగ్యానికి గురై.. ఇక వారి కోసం సెలవు పెట్టాల్సిన అవసరం వస్తే మూడు నెలల వరకు 25 శాతం వేతనం అనేది అందజేస్తారు. ప్రస్తుతం బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న ఈ కంపెనీలో మొత్తం 2000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇక గతేడాది ఏప్రిల్‌లో ఈ కంపెనీ విలువ 1 బిలియన్‌ డాలర్లకు చేరడంతో యూనికార్న్‌ల జాబితాలో చేరింది. ఈ నిర్ణయం వల్ల ఉద్యోగులకు సంస్థ పట్ల మంచి అభిప్రాయం ఉండటంతో పాటు ఇంకా అలాగే సంస్థ కోసం పని చేస్తారని కూడా కంపెనీ ప్రతినిధులు అంటున్నారు.ఇది నిజంగా వారికి చాలా మంచి న్యూస్ అనే చెప్పాలి. ఉద్యోగులను అర్ధం చేసుకోని కష్టకాలంలో ఇలా ఆదుకునే సంస్థల కోసం ఉద్యోగులు ఎల్లప్పుడూ కూడా కష్టపడి పని చేస్తారానడంలో ఎలాంటి సందేహం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: