ప్రావిడెంట్ ఫండ్ (PF), పెన్షన్ (EPS) ఇంకా బీమా (EDLI) వంటి పలు ప్రయోజనాలను ఈపీఎఫ్ఓ తమ సభ్యులకు అందిస్తోంది. ఇక ఉద్యోగి మరణానంతరం సంస్థ ఇచ్చే సామాజిక భద్రతా ప్రయోజనాలను సులభంగా కుటుంబ సభ్యలకు అందజేసేందుకు ఈ - నామినేషన్ అనేది సాయపడుతుంది. ఇక ఇంతకు ముందులా నామినేషన్ దాఖలు కోసం ఈపీఎఫ్ఓ కార్యాలయాన్ని సంప్రదించాల్సిన పనిలేదు. ఇంటి నుంచే ఆన్లైన్ ద్వారా కాగిత రహితంగా ఈ- నామినేషన్ ఈజీగా దాఖలు చేయవచ్చు.ఇక ఈ- నామినేషన్ను దాఖలు చేసేందుకు ఉద్యోగులు తమ యూఏఎన్ నంబరును ఇంకా ఈపీఎఫ్ పోర్టల్లో యాక్టివేట్ చేసుకుని ఉండాలి. దీంతో పాటు సంస్థ ఐడీ, పేరు, పుట్టిన తేదీ ఇంకా తండ్రి/ జీవిత భాగస్వామి పేరు వంటి పలు వివరాలను అందించాల్సి ఉంటుంది. ఒకరి కంటే ఎక్కువ మందిని కూడా నామినీలుగా నియమించుకోవచ్చు. అయితే ప్రతి నామినీకి సంబంధించిన కేవైసీ వివరాలను ఖచ్చితంగా అందించాలి. దీంతో పాటు పీఎఫ్/ఈడీఎల్ఐలో నామినీల వాటా (100 శాతంలో ఎవరికి ఎంత ఇవ్వాలి అనేది)ను కూడా తెలియజేయాలి. కుటుంబ సభ్యులు లేని వారు వారికి కావాల్సిన వారిని ఎవరినైనా దీనికి నామినీలుగా ఎంచుకోవచ్చు. అయితే భవిష్యత్తులో కుటుంబ సభ్యుడు వస్తే ఈ- నామినీ అనేది చెల్లదు.
ఆన్లైన్లో ఈపీఎఫ్/ ఈపీఎస్ నామినేషన్ దాఖలు చేసే విధానం ఏంటంటే.. ఇక ముందుగా ఈపీఎఫ్ఓ అధికారిక వెబ్సెట్కు వెళ్లి, అక్కడ 'సర్వీసెస్' ఆప్షన్లో 'ఫర్ ఎంప్లాయిస్' సెక్షన్పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు ఆ స్క్రీన్ కింది భాగంలో ఎడమ వైపున ఉన్న సర్వీసెస్ ఆప్షన్ కింద కనిపిస్తున్న 'మెంబర్ యూఏఎన్/ ఆన్లైన్ సర్వీస్' పైన మీరు క్లిక్ చేయాలి.అప్పుడు మెంబర్ ఇ-సేవా పోర్టల్కు పేజీకి రీడైరెక్ట్ అవుతుంది. ఇక్కడ్ మీ యూఎఎన్ నంబర్, పాస్వర్డ్ ఇంకా క్యాప్చా కోడ్ టైప్ చేసి లాగిన్ అవ్వాలి.తరువాత డ్రాప్ డౌన్ మెనూలో ఉన్న మ్యానేజ్ ట్యాబ్పై క్లిక్ చేసి 'ఇ-నామినేషన్'ను మీరు ఎంపిక చేసుకోవాలి.తరువాత కుటుంబ సభ్యుల వివరాలను ఎంటర్ చేయాలి. ఇంకా ఒకరి కంటే ఎక్కువ సభ్యుల వివరాలను కూడా ఎంటర్ చేయవచ్చు. తరువాత ఎవరికి ఎంత వాటా ఇవ్వాలో కూడా ఇక్కడే తెలపాలి. ఇలా ఒకసారి వివరాలన్నింటినీ సరి చూసుకుని 'సేవ్ ఈపీఎఫ్ నామినేషన్'పై క్లిక్ చేయాలి.ఆ తర్వాత పేజ్కు వెళ్లి ఇ-సైన్ ఆప్షన్పై క్లిక్ చేస్తే, వన్ టైమ్ పాస్వర్డ్ (ఓటీపీ) అనేది జనరేట్ అవుతుంది. మీ ఆధార్ కార్డ్కు అనుసంధానించిన ఫోన్ నంబర్కు కూడా ఓటీపీ వస్తుంది.ఆ ఓటీపీ ఎంటర్ చేసి ఇ-నామినేషన్ ప్రక్రియ పూర్తి చేయొచ్చు.ఇక ఉద్యోగుల డిపాజిట్-లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్ (ఈడీఎల్ఐ) కింద జీవిత బీమా ప్రయోజనాన్ని పెంచుతున్నట్లు ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ గతంలో జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్లో కూడా తెలిపింది. ఇక కనీస బీమాను రూ.2 లక్షల నుంచి రూ.2.5 లక్షలకు.. అలాగే గరిష్ఠ బీమా పరిమితిని రూ.6 లక్షల నుంచి రూ. 7 లక్షలకు పెంచింది.ఇక ఈ ప్రయోజనాన్ని పొందాలంటే ఈ - నామినేషన్ తప్పనిసరిగా దాఖలు చేయాలి.