డీమార్ట్ అధినేత సంపద ఆవిరైపోయిందిగా!

Purushottham Vinay
ఇక అవెన్యూ సూపర్ మార్ట్స్ కంపెనీ(డీమార్ట్) అధినేత రాధాకిషన్ దమానీ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రపంచం అపర కుబేరుల్లో ఆయన కూడా ఒకడిగా శరవేగంగా దూసుకుపోతున్నారు. ఇక భారతదేశంలో అయితే రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానికి సైతం గట్టి పోటీని ఇచ్చాడు. ఇక రాధా కిషన్ దమాని సంపద 2022 క్యాలెండర్ సంవత్సరంలో చాలా భారీగా తగ్గింది. మార్చి 31, 2022 నాటికి దమానీకి కేవలం 14 లిస్టెడ్ కంపెనీల్లో 1 శాతం వాటా ఉంది.ఇక వీటి విలువ వచ్చేసి ఇప్పుడు దాదాపు రూ.1.55 లక్షల కోట్లుగా ఉంది. అయితే.. 2022 క్యాలెండర్ సంవత్సరం ప్రారంభం సంపదతో కనుక పోలిస్తే ప్రస్తుతం 23 శాతం తక్కువకు చేరుకుంది. డిసెంబర్ నెల 31, 2021 నాటికి దమానీ సంపద వచ్చేసి రూ.2.02 లక్షల కోట్లు కాగా.. ప్రస్తుతం అది మొత్తం రూ.1.55 లక్షల కోట్లకు పడిపోయింది. అంటే దాదాపుగా నాలుగో వంతు అతని సంపద ఆవిరైంది.


రాధాకిషన్ దమానీ పెట్టుబడి పెట్టిన ఇండియా సిమెంట్స్ ఇంకా ట్రెంట్ ఇంకా యునైటెడ్ బ్రూవరీస్ ఇంకా అలాగే సుందరం ఫైనాన్స్ అలాగే 3ఎమ్ ఇండియా ఇంకా మెట్రోపోలిస్ హెల్త్ కేర్ ఇంకా బ్లూ డార్ట్ ఎక్స్ ప్రెస్ అలాగే సుందరం ఫైనాన్స్ హోల్డింగ్స్ ఇంకా అస్టా మైక్రోవేవ్ అలాగే మంగళం ఆర్గానిక్స్ తో పాటు ఇతర పెట్టుబడుల విలువ భారీగా పతనం కావటమే దమాని ఆస్తుల విలువ క్షీణతకు పెద్ద ప్రధాన కారణంగా సమాచారం  తెలుస్తోంది.ఇక ఇదిలా ఉండగా.. దేశీయ స్టాక్ మార్కెట్లు కూడా ఈ రోజు భారీ లాభాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ క్రితం సెషన్‌లో అయితే మొత్తం 54,252 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ రోజు మొత్తం 420 పాయింట్ల లాభంతో ఆరంభమైంది. అయితే.. కాసేపటికి భారీ లాభాల నుంచి స్వల్ప లాభాల్లోకి మార్కెట్లు అనేవి జారుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు సూచీలపై ప్రభావం అనేవి చూపుతున్నాయి. నిన్న అమెరికా మార్కెట్లు కూడా లాభాల్లో ముగిశాయి. అమెరికా టెక్ స్టాక్స్‌లో కొనుగోళ్లు కూడా నమోదవ్వడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: