PM కిసాన్ స్కీం: రైతులకు రేపు 10వ విడత?

Purushottham Vinay
ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద రైతులు డబ్బులు పొందుతున్న సంగతి తెలిసిందే. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన10వ విడత కోసం రైతులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇప్పటి వరకు ఈ పథకం 9 విడతలుగా రైతుల ఖాతాల్లోకి చేరడం జరిగింది. ఇక 10వ విడత విడుదల చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు పూర్తి చేసింది.రేపు అనగా డిసెంబరు 15 వ తేదీ నాడు రైతుల ఖాతాల్లోకి డబ్బులు వస్తాయని గతంలో ఊహాగానాలు వినిపించగా, ఇప్పుడు ఆ వాయిదాను ప్రధాని నరేంద్ర మోదీ డిసెంబర్ 16న విడుదల చేయవచ్చని భావిస్తున్నారు. 10వ విడతకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇంకా తేదీని ప్రకటించలేదు. లబ్ది పొందుతున్న లబ్ధిదారుల స్థితిని దృష్టిలో ఉంచుకుని, జాప్యం అంచనా వేయబడింది. ప్రతిసారీ మాదిరిగానే, ప్రధాని మళ్లీ యధావిధిగా తన నిర్ణయాలతో ప్రజలను ఆశ్చర్యపరుస్తారని ఊహాగానాలు అనేవి వినిపిస్తున్నాయి.

డిసెంబర్ 16 వ తేదీ నాడు గుజరాత్ ప్రభుత్వం సహజ వ్యవసాయ పద్ధతులపై నిర్వహించే వ్యవసాయ కార్యక్రమంలో ఆన్‌లైన్ కార్యక్రమంలో ప్రసంగించడం జరుగుతుంది. ఇక ఈ కార్యక్రమంలో 5 వేల మందికి పైగా రైతులు పాల్గొనే అవకాశం ఉంది. అటువంటి పరిస్థితిలో, ప్రధానమంత్రి కిసాన్ పథకం యొక్క 10వ విడతకు సంబంధించిన వేడుకలో ప్రధానమంత్రి  దీనికి సంబంధించిన ప్రకటన అనేది చేయవచ్చు. ప్రస్తుతం, ఇన్‌స్టాల్‌మెంట్ స్టేటస్ వచ్చేసి '10వ విడత కోసం రాష్ట్రం సంతకం చేసిన RFT'ని చూపుతుంది. RFT (బదిలీ కోసం అభ్యర్థన) అంటే ఆధార్ నంబర్, బ్యాంక్ ఖాతా నంబర్ ఇంకా అలాగే బ్యాంక్ యొక్క IFSC కోడ్‌తో సహా లబ్ధిదారుని వివరాలను రాష్ట్ర ప్రభుత్వం ధృవీకరించడం అనేది జరిగింది. అలాగే, విచారణలో డేటా సరైనదని తేలింది. ఇప్పుడు, కేవలం FTO (ఫండ్ ట్రాన్స్‌ఫర్ ఆర్డర్) మాత్రమే రూపొందించాలి. స్టేటస్‌లో 'FTO రూపొందించబడింది. ఇంకా అలాగే చెల్లింపు నిర్ధారణ పెండింగ్‌లో ఉంది' అని చూపిస్తే, డబ్బు ఖాతాకు బదిలీ చేయబడుతుందని అర్థం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: