కోట్లకు పడగలెత్తేసిన.. ఫ్రెష్ వర్కర్స్..

Chandrasekhar Reddy
ఇటీవల చాలా సంస్థలు షేర్ మార్కెట్ లో (ఐపీవో) లిస్టింగ్ కు వెళ్తున్న విషయం బాగా చూస్తున్నాం. లిస్టింగ్ లో పెట్టిన కొద్ది రోజులలో ఆయా సంస్థలకు భారీ స్పందన కూడా లభిస్తుంది. అంటే ఈ తరహా పెట్టుబడుల పై అనేక మందిలో ఆసక్తి పెరుగుతుందని అర్ధం అవుతుంది. అలాగే ఆయా సంస్థలలో పని చేసేవారికి కూడా దీనిలో మొదట ప్రాధాన్యత ఇస్తుండటంతో వారు కూడా బాగుపడుతున్నారు. ఈ ఏడాది మాత్రమే అనేక సంస్థలు ఈ తరహా లిస్టింగ్ కు వెళ్లడం జరిగింది. తద్వారా ఆయా సంస్థలకు కొత్త పెట్టుబడులు కూడా రావడం తో ఉన్న లోన్స్ తీర్చుకోవడం లేదా వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడం లాంటివి చేస్తున్నాయి.
తాజాగా అమెరికాలో ఫ్రెష్ వర్క్స్ సంస్థ లిస్టింగ్ కి వెళ్ళింది. దీనితో ఒక్క రోజులోనే దాని షేర్ విలువ 46.67 డాలర్లు గా నమోదైంది. సంస్థకు ఒక్క రోజులోనే వందకోట్ల నిధులు సమీకరించుకోగలిగింది. అలాగే సంస్థ విలువ కూడా వెయ్యి కోట్ల డాలర్లకు పెరిగిపోయింది. సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులు కూడా 500 మంది వరకు కోటీశ్వరులు అయ్యారు. ఐపీవో లో సంస్థ షేర్ విలువ 36డాలర్లుగా నిర్ణయించగా అది కాస్తా 46 డాలర్లు దాటేసింది. ఈ ఐపీవో ద్వారా సంస్థ 2.85 కోట్ల షేర్లను ప్రజలకు కేటాయించింది. ఇక నష్టాలు చవిచూడాల్సి వచ్చిన వారి కోసం సంస్థ క్లాస్ ఏ షేర్లను 28 కోట్లపైనే అందుబాటులో ఉంచింది. అంటే వీరు మాములు ధర కంటే తక్కువకే షేర్ లను కొనుగోలు చేయవచ్చు. దీనికోసం 30 రోజుల వరకు గడువు ఇచ్చింది సంస్థ.
సంస్థ వ్యవస్థాపకులు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ స్థాయిలో స్పందన ఊహించలేదని చెప్పారు. గిరీష్ సంస్థను 2011లో స్థాపించారు. ఇప్పుడు ఐపీవో కు వెళ్లారు, అనూహ్య స్పందన వచ్చిందని ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ ఐపీవో తరువాత ఎన్నో భారతీయ సంస్థలు తమ స్థాయిని అంతర్జాతీయంగా తీర్చిదిద్దుకోగలవని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. తమ సంస్థలోని 76 శాతానికి పైగా ఉద్యోగులకు షేర్ లుఉన్నాయని ఆయన తెలిపారు. అందులో 500 మంది కోటీశ్వరులు అయ్యారని, వారిలో 70 మంది 30 ఏళ్ళ లోపు వారు అని ఆయన చెప్పారు. ఐపీవో ద్వారా వచ్చిన నిధులను సంస్థ విస్తరణకు ఉపయోగిస్తామని గిరీష్ తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: