అమ్ముదామంటే... రికార్డులతో పరుగులు..!
విశాఖ ఉక్కు పరిశ్రమకు నష్టాల వంక చూపుతున్న కేంద్ర ప్రభుత్వం... దానిని వంద శాతం ప్రైవేటీకరణ చేసేందుకు కేంద్రం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. ఇదే విషయంపై దాదాపు 6 నెలలుగా విశాఖ నగరంలో అటు కార్మికులు, ఇటు ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళనలు, నిరసనలు చేస్తున్నాయి. ఇదే విషయంపై పార్లమెంట్లో కూడా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న సమయంలోనే విశాఖ ఉక్కు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో నేతలు... కేంద్ర ప్రభుత్వ పెద్దలను, అన్ని పార్టీల నేతలు, ఎంపీలను స్వయంగా కలిసి వినతి పత్రాలు సమర్పించారు. ఇంత జరుగుతున్నా కూడా కేంద్రం మాత్రం ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. పూర్తిస్థాయిలో ప్రైవేటీకరణ చేస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్వయంగా ప్రకటించారు. దీంతో విశాఖ ఉక్కు పరిరక్షణ సమితి తన పోరాటాన్ని మరింత ఉధృతం చేసింది. ఓ వైపు ప్రైవేటీకరణ ప్రక్రియ వేగంగా జరుగుతున్నప్పటికీ... రికార్డు స్థాయిలో ఉత్పత్తి సాధిస్తోంది విశాఖ ఉక్కు పరిశ్రమ. ఇప్పటికైనా కేంద్రం కరుణిస్తిదేమో చూడాలి మరి.