గుడ్ న్యూస్.. ఫ్లిప్‌కార్ట్ 'మొబైల్స్ బొనాంజా' సేల్ ప్రారంభం...!!

Satvika
ఈ-కామర్స్ దిగ్గజ సంస్థ ఫ్లిప్‌కార్ట్ కష్టమర్లను పెంచుకొనే దిశగా ఆలోచనలు చేస్తుంది.. అంతేకాదు ఎలెక్ట్రానిక్ వస్తువుల పై భారీ డిస్కౌంట్లను అందిస్తుంది. పండగల సీజన్ వస్తే చాలు ఆఫర్ల మీద ఆఫర్లను అందిస్తున్నారు.. మొన్నామధ్య బంపర్ సేల్ ను అందించిన సంస్థ తాజాగా మరో ఆఫర్ ను అందిస్తుంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. స్మార్ట్ ఫోన్ల పై మరో మారు అదిరిపోయే ఆఫర్లను అందిస్తుంది. అందులో భాగంగా మొబైల్స్ బొనాంజా సేల్ ను ప్రారంభించింది..నిన్న ఈ ఆఫర్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది.



అందులో భాగంగా ఈ ఆఫర్ ను ఈ నెల పది వరకు అందించనుంది.సేల్‌లో భాగంగా ఎక్స్‌చేంజ్ ఆఫర్లతోపాటు యాపిల్, శాంసంగ్, రియల్‌మి, షియోమీ వంటి బ్రాండ్లపై బ్యాంక్ డీల్స్ ప్రకటించింది. ఈ సేల్‌లో కొనుగోలు చేసే స్మార్ట్ ‌ఫోన్ల పై నో-కాస్ట్ ఈఎంఐ కూడా ఇవ్వనున్నట్టు తెలిపింది. ఇకపోతే ఐఫోన్ ఎస్‌ఈ 64జీబీ స్టోరేజీ వేరియంట్ ధరను రూ. 32,999గా పేర్కొనగా, ఇన్ఫినిక్స్ నోట్ 7 4జీబీ+64జీబీ స్టోరేజీ వేరియంట్ ధరను 11, 499 రూపాయలు గా ప్రకటించింది.



ఐఫోన్ ఎక్స్ ఆర్ 64జీబీ వేరియంట్ ధరను రూ. 40 వేలుగా పేర్కొంది. ప్రీమియం ఫోన్ల విషయానికి వస్తే, ఐఫోన్ 11 ప్రొ ధరను రూ. 26,601 తగ్గించి రూ. 79,999కే అందిస్తుంది.ఒప్పో ఎ31 64జీబీ వేరియంట్ ధరను రూ.10,990కి, మోటొరోలా మోటో జి9ఐ 4జీబీ+64జీబీ వేరియంట్‌ను రూ.9,999కి అందుబాటు లోకి తీసుకురాగా, ఆసుస్ రోగ్ ఫోన్ 8జీబీ+128జీబీ వేరియంట్ ధరను రూ.46,999 నుంచి రూ. 44,999కి తగ్గించేసింది.రియల్‌మి నర్జో 6జీబీ ర్యామ్+64జీబీ స్టోరేజీ వేరియంట్ అసలు ధర రూ. 14,999 కాగా, దానిని రూ.13,999కే అందుబాటులో ఉంచింది. ప్రముఖ బ్రాండ్ ఫోన్లను భారీగా తగ్గించింది.. ఇంక ఆలస్యం ఎందుకు మీకు కావలసిన ఫోన్లు తక్కువ ధరకే లభిస్తున్నాయి కొనేసేయండి...

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: