కొత్త ఇల్లు కొనాలనుకునేవారికి కేంద్రం అదిరిపోయే ఆఫర్..
అంతేకాదు దానితో పాటుగా రియల్ ఎస్టేట్ రంగంలో కొన్ని మెళుకువలు కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. వివరాల్లోకి వెళితే..రూ.2 కోట్లలోపు ఇళ్లకు ఇది వర్తిస్తుంది. ఇల్లు కొంటే 20 శాతం ఇన్కమ్ ట్యాక్స్ రిబేట్ లభిస్తుంది. 2021 జూన్ 30 వరకు ఈ ప్రయోజనం అందుబాటులో ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం స్టాంప్ డ్యూటీ, అగ్రిమెంట్ వ్యాల్యూ మధ్య ఉన్న వ్యత్యాసాన్ని డబుల్ చేసింది. ఇలా చేయడం వల్ల చాలా మందికి సొంతిల్లు కట్టుకోవాలని అనుకునేవారికి సులువుగా ఉంటుందని అంటున్నారు.
మోదీ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయం పై ఇటు ఇంటి కొనుగోలుదారలుకు అటు హౌసిండ్ డెవలపర్లకు ప్రయోజనం కలుగనుంది. ఇన్కమ్ ట్యా్క్స్ యాక్ట్లోని సెక్షన్ 43 సీఏ కింద సర్కిల్ రేటు అగ్రిమెంట్ వ్యాల్యూ మధ్య వ్యత్యాసాన్ని 10 శాతం నుంచి 20 శాతానికి పెంచుతామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.రూ.2 కోట్లలోపు ఇళ్లను కొనే వారికి ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 56 ఎక్స్ కింద 20 శాతం వరకు రిబేట్ లభిస్తుంది.ఇలా చేయడం వల్ల తక్కువ ధరకే ఇళ్లు లభిస్తాయి. ఇంకా పన్ను మినహాయింపు కూడా పొందొచ్చు. ఈ నిర్ణయం తో మోదీ సర్కార్ పై మరోసారి ప్రశంసలు వెలు వెత్తుతున్నాయి..