బంపర్ ఆఫర్ ప్రకటించిన ఎల్జి సంస్థ...!

Suma Kallamadi

ప్రస్తుతం కరోనా నేపథ్యంలో అనేక వ్యాపార రంగాలు దెబ్బతిన్న సంగతి అందరికీ తెలిసిందే. దీనితో వ్యాపార సంస్థలు తమ దగ్గర ఉన్న స్టాకును అమ్ముకునేందుకు కస్టమర్లకు భారీ ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. ఇందుకు సంబంధించి తాజాగా ఎల్జీ కంపెనీ ప్రత్యేక ఆఫర్స్ తో ముందుకు వచ్చింది. ఎల్జీ కంపెనీ కు సంబంధించిన ఎలక్ట్రానిక్ వస్తువులు ఎవరైనా కొనుగోలు చేస్తే వారికి, ఏకంగా 50 వేల రూపాయలు కరోనా వైరస్ కి ఇన్సూరెన్స్ పాలసీ వినియోగదారులకు అందజేయబడుతుంది.

ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఎల్జి వెబ్ సైట్ లో ఇచ్చిన సమాచారం ప్రకారం... కస్టమర్లు ఎవరైనా రిఫ్రిజిరేటర్, టీవీ, ఏసీ, మైక్రోఓవెన్ తదితర ఉత్పత్తులు కొనుగోలు చేసుకోవచ్చు. అలాగే వస్తువుకు సంబంధించిన ఇన్వాయిస్ లో మీరు ఎల్జి ఉత్పత్తిని కొనుగోలు చేసిన షరతులు నిబంధనలు పూర్తిగా చదవాలి. ఇక ఈ నిబంధనల్లో భాగంగా గత మూడు నెలలుగా ఏ ఒక్క కస్టమర్ కూడా విదేశాలకు వెళ్లి వచ్చినట్లు నిర్ధారణ అవ్వకూడదు. ఇక ఈ ఆఫర్ లో కస్టమర్ కు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయినట్లు అయితే అతను కొన్న మొత్తానికి ప్రయోజనం పొందవచ్చు.

 

 


ఇక కంపెనీ నుంచి ఈ ఆఫర్ కింద కరుణ వైరస్ బీమా యొక్క చెల్లుబాటు ఒక సంవత్సరంపాటు కాల వ్యవధి ఉంటుందంటూ ఎల్జీ కంపెనీ వారు తెలియజేశారు. ఇక కంపెనీ ప్రవేశపెట్టిన ఈ ఆఫర్ లో కొనుగోలు చేసిన ఉత్పత్తిని బట్టి కనీస మొత్తం హామీ కింద 30 వేల నుంచి 50 వేల వరకు ఉంటుందని కంపెనీ అధికారులు తెలియజేశారు. ఇక ఈ బీమా పథకానికి మూడు సంవత్సరాల నుంచి 65 సంవత్సరాల వయసు గలవారు అర్హులు అని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: