
స్టాక్ మార్కెట్కు బ్లాక్ ఫ్రైడే... కరోనా దెబ్బతో 12 ఏళ్ల చెత్త రికార్డు బ్రేక్...!
గత 12 ఏళ్లలో ఇలా షేర్ మార్కెట్ ప్రారంభమైన వెంటనే నిలిచిపోవడం ఇదే తొలిసారి. అంటే కరోనా దెబ్బతో మన స్టాక్ మార్కెట్ చెత్త రికార్డు 12 ఏళ్ల కనిష్ట పతనానికి చేరుకుంది. బీఎస్ఈ సెన్సెక్స్ 9.43 శాతం తగ్గుదలతో 29,687 పాయింట్లకు పతనమైంది. అంటే సెన్సెక్స్ 3,000 పాయింట్లకు పైగా పడిపోయింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ కూడా 10 శాతం పతనంతో (966 పాయింట్లు) 8624 పాయింట్లకు క్షీణించింది.
ఇక ఓవరాల్గా మార్కెట్కు 45 నిమిషాల బ్రేక్ ఇచ్చారు. ఇలా 12 ఏళ్లలో ఇలా జరగడం ఇదే తొలిసారి. కరోనా దెబ్బతో ఇండియా రూపాయి కూడా ఘోరంగా పతనమవుతోంది. అమెరికా డాలర్తో పోలిస్తే ఇండియన్ రూపాయి 20 పైసలు పడిపోయింది. 74.42 వద్ద ట్రేడవుతోంది.