భగ్గుమంటున్న పెట్రోల్, డీజిల్ ధరలు..  

Durga Writes

నేడు పెట్రోల్, డీజిల్ ధరలు భారీగానే షాక్ ఇచ్చాయి. పెట్రోల్ ధర ఈరోజు కూడా పెరిగింది.. అలానే డీజిల్ ధర కూడా ఈరోజు పెరిగింది. గత 20 రోజుల నుంచి పెట్రోల్ ధర పెరుగుతూనే ఉంది. దీంతో వాహనదారులకు పెట్రోల్, డీజిల్ ధరలు ఎప్పుడు తగ్గుతాయా అని ఎదురు చూస్తున్నారు. మరో వైపు డీజిల్ ధర కూడా అటు ఇటు కదలకుండా స్థిరంగా కొనసాగుతుంది.   

 

వివిధ మెట్రో నగర్లో నేడు శనివారం పెట్రోల్ ధర లీటర్ కు 16 పైసల చొప్పున పెరగగా డీజిల్ ధర మాత్రం నిలకడగా కొనసాగుతోంది. హైదరాబద్ లో పెట్రోల్ ధర లీటర్ కు 16 పైసలు పెరుగుదలతో రూ. 79.12కు చేరగా, డీజల్ ధర గత నాలుగు రోజుల నుంచి స్థిరంగా కొనసాగుతుంది. ఇంకా విజయవాడలోని పెట్రోల్, డీజిలు ధరలు కూడా ఇలాగె కొనసాగుతున్నాయి. 

 

దేశ రాజధాని ఢిల్లీలోనూ పెట్రోల్, డీజిల్ ధరలు ఇలాగె కొనసాగుతున్నాయి. కాగా ఆర్ధిక రాజధాని అయినా ముంబైలో కూడా పెట్రోల్, డీజిల్ ధరలు ఇలానే కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పెరగడమే ఇందుకు కారణం అని మార్కెట్ నిపుణులు చెప్తున్నారు. 

 

దీంతో 20 రోజుల ముందు 76 రూపాయిలు ఉన్న పెట్రోల్ ధర 10పైసలు, 15 పైసలు  ప్రకారం పెరిగి చివరికి 79 రూపాయలకు చేరింది. ఇది ఇలాగే కొనసాగితే ఇంట్లో వాహనాలు పెట్టి నడుచుకుంటూ వెళ్లే రోజులు వస్తాయి. ఇంతలా రోజురోజుకు పెరిగే పెట్రోల్, డీజిల్ ధరలు ఎప్పుడు తగ్గుతాయి అనేది మార్కెట్ నిపుణులు కూడా చెప్పలేకపోతున్నారు. 

 

అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు (క్రూడాయిల్) ధరలు తగ్గాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌‌కు 0.59 శాతం తగ్గుదలతో 63.59 డాలర్లకు క్షీణించింది. మారో వైపు గత 20 రోజులుగా పెట్రోల్ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. కేవలం 20 రోజుల్లో పెట్రోల్ ధరపై 3 రూపాయిలు పెరిగింది. ఏది ఏమైనా ఈ వార్త వాహనదారులకు షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: