' జియో' కస్టమర్లకు గుడ్ న్యూస్!!
దేశీయ అతిపెద్ద రెస్టారెంట్ టేబుల్ రిజర్వేషన్ సర్వీస్ సంస్థ డైన్అవుట్తో జియో ఒప్పందం కుదుర్చుకుంది. డైన్ అవుట్ నిర్వహిస్తున్న గ్రేట్ ఇండియన్ రెస్టారెంట్ ఫెస్టివల్కు రిలయన్స్ జియో డిజిటల్ భాగస్వామిగా మారి కస్టమర్లకు ప్రత్యేక తగ్గింపును ఆఫర్ చేస్తోంది. డైన్అవుట్ ద్వారా టేబుల్ రిజర్వేషన్స్ చేసేవారికి బుకింగ్ ఫీజు వసూలు చేస్తుంది. కానీ ఈ ప్లాట్ఫాంలో జియో యూజర్లు చేసుకునే మొదటి బుకింగ్పై రూ.100 తగ్గింపు లభిస్తుంది.
అలాగే బిల్లుపై పత్య్రేక డిస్కౌంట్ను కూడా అందిస్తుంది. దీంతోపాటు ఫుడ్, డ్రింక్స్, బఫేపై కొన్ని ఆఫర్స్ పొందొచ్చు. హైదరాబాద్లో కూడా... ఆగస్ట్ 1న, మొదలైన ఈ ఫెస్టివల్ 2019 సెప్టెంబర్ 1వరకు నిర్వహించనున్నారు. హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, బెంగళూరు, కోల్కతా, పూణె, చెన్నై, హైదరాబాద్, అహ్మదాబాద్, చండీగఢ్, గోవా, జైపూర్, లక్నో, ఇండోర్, సూరత్, కొచ్చి, లుధియానా, నాగ్పూర్ నగరాల్లో ఈ ఫెస్టివల్ జరుపుతున్నారు.
డైన్అవుట్ ఆపరేషన్స్ నిర్వహిస్తున్న 17 పట్టణాల్లో, ఎనిమిదివేలకు పైగా రెస్టారెంట్లలో ఈ తగ్గింపు లభిస్తుంది. అలాగే టోటల్ ఫుడ్ బిల్, డ్రింక్స్ బిల్, బఫేపై 50శాతం తగ్గింపు ఆఫర్. ఈ ప్రత్యేక ఆఫర్ కేవలం జియో యూజర్లకు మాత్రమే.