నిర్మాణ రంగ సంస్థలు ఇప్పుడు కొత్త కష్టాలలో పడ్డాయి. తాము అభివృద్ధి చేసిన ఇళ్ళు అమ్ముడవకపోవడం విషయం లో వారు తీవ్రమైన ఇబ్బందులు ఎదురుకొంటున్నారు . ప్రస్తుతం ఉన్న ఆర్ధిక సంవత్సరం త్రైమాసికం లో డెవలప్మెంట్ పూర్తి అయినా కూడా విక్రయించబడని ఆస్తుల మొత్తం పదేళ్ల గరిష్ఠానికి చేరింది. మొత్తం 1200 కోట్ల చదరపు అడుగుల్లో డెవలప్ చేసిన రూ. 6 లక్షల కోట్ల విలువైన గృహాలు, వాణిజ్య సముదాయాలు యజమానుల కోసం ఎదురుచూస్తున్నాయి. గత సంవత్సరంతో పోలిస్తే ఇది 2 శాతం అధికం. 2015-16 తొలి త్రైమాసికంలో అమ్ముడుకాని ఆస్తుల మొత్తం 15 శాతంగా ఉండగా, ఇప్పుడది 17 శాతానికి పెరిగింది. ముఖ్యంగా ఢిల్లీ - ఎన్సీఆర్ పరిధిలో ఈ తరహా నిర్మాణాలు అధికంగా కనిపిస్తున్నాయి. నిర్మాణ రంగంలో నెలకొన్న అనిశ్చితి తొలగకపోవడమే ఇందుకు కారణమని విశ్లేషకులు వ్యాఖ్యానించారు.