చంద్రబాబును స్వయంగా కలవనున్న ఎన్టీఆర్.. అందుకోసమేనా..?

murali krishna
తమ సినిమాలను చూసి ఆదరించి, అభిమానించే తెలుగు ప్రేక్షకులను ప్రకృతి విపత్తుల నుంచి ఆదుకునేందుకు టాలీవుడ్‌ సినీ ప్రముఖులు ఎప్పుడూ ముందుంటారు. జనానికి అండగా నిలిచేందుకు, తమకు చేతనైనంత సాయం చేసేందుకు ముందుకొచ్చే టాలీవుడ్ స్టార్స్ మరోసారి తమ గొప్ప మనసును చాటుకున్నారు.రెండు తెలుగు రాష్ట్రాల్లో వరదల కారణంగాఇబ్బందులు పడుతున్న ప్రజలను ఆదుకునేందుకు సినీ ప్రముఖులు ఒక్కొక్కరుగా విరాళాలను ప్రకటిస్తున్నారు. టాలీవుడ్ స్టార్ హీరోలు బాలకృష్ణ, ఎన్టీఆర్, మహేష్ బాబు కోటి రూపాయలు ప్రకటించారు. ఇందులో తెలంగాణకు రూ.50 లక్షలు, ఆంధ్రప్రదేశ్‌కు రూ.50 లక్షలు చొప్పున సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు అందజేయనున్నారు.అలాగే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా వ్యక్తిగతంగా కోటి రూపాయల విరాళం ప్రకటించారు. ఇక యువహీరోలు సిద్ధు జొన్నలగడ్డ ఏపీకి రూ.15 లక్షలు, తెలంగాణకు రూ.15 లక్షలు చొప్పున ముప్ఫై లక్షలు అనౌన్స్ చేశాడు. అలాగే విశ్వక్ సేన్ ఏపీ, తెలంగాణకు రూ.5 లక్షల చొప్పున విరాళం ప్రకటించాడు. నిర్మాతలు ఎస్.రాధాకృష్ణ, నాగవంశీలతో కలిసి దర్శకుడు త్రివిక్రమ్ రెండు రాష్ట్రాలకు చెరొక రూ.25 లక్షల చొప్పున రూ.50 లక్షలు ప్రకటించారు. నిర్మాత అశ్వినీదత్ ఏపీకి రూ.25 లక్షల విరాళం అందజేస్తామన్నారు. యువ దర్శకుడు వెంకీ అట్లూరి తెలంగాణకు రూ.5 లక్షలు, ఏపీకి రూ.5 లక్షలు చొప్పున ప్రకటించాడు. ఇక హీరోయిన్ అనన్య నాగళ్ల తెలుగు రాష్ట్రాలకు చెరో రెండున్నర లక్షల చొప్పున ప్రకటించింది. ఆపదలో ఉన్న ప్రజల కోసం సెలబ్రిటీస్‌ ముందుకొచ్చి ఆపన్న హస్తం అందించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళంగా ప్రకటిస్తున్నానంటూ ఎన్టీఆర్ తన సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు.అంతేకాదు, త్వరలోనే రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలిసి ఎన్టీఆర్ స్వయంగా చెక్‌లను అందించనున్నాడని తెలుస్తుంది. ముఖ్యంగా తన మామయ్య.. ఏపీ సీఎం చంద్రబాబుని ఎన్టీఆర్ త్వరలో కలవనున్నాడట. ప్రసతుతం ఈ వార్త వైరల్ కావడంతో ఇది నిజంగా జరిగితే బాగుండు అంటూ ఆశక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ కలయికతో నందమూరి అభిమానులు, తెలుగుదేశం శ్రేణుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి అనడంలో సందేహం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: