ఇక ప్రస్తుతం కామన్వెల్త్ క్రీడలు జరుగుతున్న సంగతి అందరికీ కూడా తెలిసిందే. ఈ క్రీడల్లో భారత్ రెజ్లర్లు అయితే చాలా సూపర్ గా అదరగొడుతున్నారు. ఒక్కరోజే రెండో స్వర్ణాలు ఇంకా అలాగే ఒక రజతం సొంతం చేసుకోవడం జరిగింది.ఇదిలా ఉండగా ఇంకా తాజాగా రియో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత ఇంకా అలాగే స్టార్ రెజ్లర్ అయిన సాక్షి మాలిక్ కామన్వెల్త్ పోటీల్లో స్వర్ణంని కొల్లగొట్టింది. ఈ 62 కేజీల ఫ్రీస్టైల్ విభాగంలో కెనడాకు చెందిన అనా గొడినెజ్పై సాక్షి మాలిక్ మంచి ఘన విజయం సాధించింది.
ఇక ఈ పతకంతో కలిపి ఈ పోటీల్లో భారత్ మొత్తం 8 స్వర్ణాలు సాధించింది. సాక్షి మాలిక్ గెలవడానికి ముందే రెజ్లింగ్లో భారత స్టార్ రెజ్లర్ బజరంగ్ పునియా 65 కేజీల ఫ్రీస్టైల్ విభాగంలో కెనడాకు చెందిన మెక్నెల్ను ఓడించి భారత దేశానికి స్వర్ణాన్ని అందించాడు. ఇంకా అలాగే 57 కేజీల ఫ్రీస్టైల్ విభాగంలో అన్షుమాలిక్ రజతం తెచ్చింది.