ఒమిక్రాన్ : తెలంగాణలో కొత్త కేసులు ఎన్నో తెలుసా..?
ఈ కొత్త కేసులతో కలిపి మొత్తం కేసుల సంఖ్య 55కు చేరుకున్నది. ఒమిక్రాన్ బారిన పడి 10 మంది బాధితులు ఇప్పటివరకు కోలుకున్నారు. ఇవాళ వెలుగులోకి వచ్చిన కేసులలో 10మంది నాన్ రిస్క్ దేశాల నుండి వచ్చిన వారికి సోకిందని వైద్యారోఘ్యశాఖ అధికారులు వెల్లడించారు. మరొక ఇద్దరు మాత్రం కాంటాక్ట్ ఒమిక్రాన్ బాధితులు అని పేర్కొన్నారు. మరోవైపు రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 182 కొవిడ్ కేసులు, 1 మరణం సంభవించింది. 181 మంది కోలుకోగా.. రాష్ట్రంలో ప్రస్తుతం 3417 క్రియాశీల కేసులు ఉండగా.. రికవరీ రేటు 98.90 శాతం ఉండగా.. మరణాల రేటు 0.59 శాతం ఉన్నదని ప్రభుత్వం విడుదల చేసిన బుటిటెన్లో పేర్కొంది.