హైదరాబాద్‌లో తాగుబోతుల వీరంగం.. న‌లుగురు బ‌లి..!

N ANJANEYULU
హైద‌రాబాద్ న‌గ‌రంలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు విప‌రీతముగా పెరిగిపోతున్నాయి. పోలీసులు ఎంత నిఘా పెట్టినా వారి క‌ళ్ల‌ను క‌ప్పి ప‌లువురు వ్య‌క్తులు ఫూటుగా మ‌ద్యం సేవించి వాహ‌నాల‌ను న‌డుపుతున్నారు. సోమ‌వారం ఒకే రోజు పుల్లుగా తాగి వాహ‌నాలు న‌డ‌ప‌డంతో మూడు రోడ్డు ప్ర‌మాదాల‌కు కార‌ణం అయ్యారు. బంజారాహిల్స్‌, నార్సింగి, ఎస్‌.ఆర్‌.న‌గ‌ర్‌ల‌లో ఈ రోడ్డు ప్ర‌మాదాలు చోటు చేసుకున్నాయి.
తాజాగా నార్సింగి వ‌ద్ద సంజీవ్ అనే వ్య‌క్తి మ‌ద్యం మ‌త్తులో కారుతో ఓ బైకును ఢీ కొట్టాడు. ఈ ప్ర‌మాదంలో బైకు పై ఉన్న దంప‌తులు ఇద్ద‌రూ అక్క‌డిక‌క్క‌డే మృతి చెందారు. ఎంజీఐటీ వ‌ద్ద రోడ్డు ప్ర‌మాదం చోటు చేసుకుంది. నార్సింగి మున్సిపాలిటిలో విధులు నిర్వ‌హిస్తున్న మౌనిక దంపతులు ప‌ని నిమిత్తం బ‌య‌టికి వెళ్ల‌డంతో ఈ ఘ‌ట‌న చోటు చేసుకున్న‌ది. ఇంట్లో నుంచి బ‌య‌టికి వెళ్లిన వారు  అక‌స్మాత్తుగా మృత్యువాత ప‌డ‌డంతో వారి కుటుంబ స‌భ్యులు క‌న్నీటి ప‌ర్వంత‌మ‌య్యారు. టీఎస్ 07 ఈజ‌డ్ 6395 బైకు పై వ‌స్తుండ‌గా వెనుక నుంచి వేగంగా వ‌చ్చిన కారు ఢీ కొట్ట‌డంతో వారు అక్క‌డిక‌క్క‌డే ప్రాణాల‌ను కోల్పోయారు.
మ‌రోవైపు బంజారాహిల్స్‌లో రోహిత్ అనే వ్య‌క్తి త‌ప్ప‌తాగిన మైకంలో ఇవ్వాళ తెల్ల‌వారుజామున స్కూటీని ఢీ కొట్ట‌డంతో ఇద్ద‌రు యువ‌కులు అక్క‌డిక‌క్క‌డే మృతి చెందారు. ఇప్ప‌టికే నిందితుడిని కూడా ఇవాళ సాయంత్రం అరెస్ట్ చేసారు. ఎస్‌.ఆర్‌.న‌గ‌ర్‌లో ఓ యువ‌కుడు మ‌ద్యం సేవించి ఆటో న‌డ‌ప‌డంతో.. ఆటో ఫుట్‌పాత్‌పైకి వెళ్లి.. ఈ ఘ‌ట‌న‌లో మ‌హిళ‌కు గాయాల‌య్యాయి. వెంట‌నే స్థానికులు ఆమెను ఆసుప‌త్రికి తీసుకెళ్లి చికిత్స అందించారు. తాగుబోతులు ఫూటుగా మ‌ద్యం సేవించి కిక్కులో ర్యాష్ డ్రైవింగ్ కార‌ణంగా ఒకేరోజు న‌లుగురు వ్య‌క్తులు మ‌ర‌ణించ‌డం గ‌మ‌నార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: