సోనియాగాంధీకి..రోశయ్య అత్యంత ఆప్తుడు : మల్లికార్జున ఖర్గే
రోశయ్యకి నివాళి అర్పిచేందుకు ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ స్వయంగా నన్ను ఇక్కడికి పంపించారు అని గుర్తు చేసారు ఖర్గే. ఎలాంటి కాంట్రవర్సీ లేని నాయకుడు, మచ్చలేని వన్నె తెచ్చే నాయకుడు రోశయ్య అని.. అందరినీ కలుపుకొని పోయే మనస్తత్వం కలిగిన వ్యక్తి అని వెల్లడించారు. భారతదేశంలోనే ఆర్థికమంత్రి పదవీకి ఒక వన్నె తీసుకొచ్చిన నాయకుడు కొణిజేటి రోశయ్య అని తెలిపారు మల్లికార్జున ఖర్గే. గాంధీభవన్లో ఆయనకు శ్రద్ధాంజలి ఘటించి నివాళులర్పించి.. అనంతరం రోశయ్య కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు మల్లికార్జున ఖర్గే.