శ్రీశైలంలో హైదరాబాద్ యువతి ఆత్మహత్య
హైదరాబాద్ నగరానికి చెందిన మౌనికారెడ్డి(25) ప్రధాన ఆలయం వద్దకు పాయిజన్ తీసుకుని చేరుకుంది. ఇది గమనించిన అక్కడ ఉన్న భక్తులు పోలీసులకు సమాచారం అందించారు. ఆత్మహత్య చేసుకుని అపస్మారక స్థితిలోకి వెళ్లిన యువతిని వెంటనే అంబులెన్స్లో సున్నిపెంట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మౌనిక మృతి చెందింది. మౌనికరెడ్డి ఆత్మహత్యకు గల కారణాలు మాత్రం తెలియడం లేదని.. కానీ మౌనికారెడ్డి వద్ద పోలీస్ ఫిర్యాదు కాపీ లభించినది. దాని ఆధారంగా విచారణ చేపట్టనున్నట్టు వెల్లడించారు పోలీసులు.