ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మూడు రాజధానులు బిల్లు ను రద్దు చేయడం వెనక భారతీయ జనతా పార్టీ ఉందని వ్యాఖ్యలు ఇప్పుడు హల్ చల్ చేస్తున్నాయి మూడు రాజధానులు బిల్లు కు సంబంధించి ఏపీ ప్రభుత్వం కాసేపటి క్రితం మంత్రివర్గ సమావేశంలో రద్దు చేస్తున్నట్లు గా ప్రకటించిన నేపథ్యంలో పలువురు బీజేపీ నేతలు దీనికి సంబంధించి స్పందిస్తున్నారు రంగంలోకి భారతీయ జనతా పార్టీ దిగిందని అందుకే అమరావతి రైతుల పాదయాత్రలో పాల్గొని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకు వచ్చిందని అందుకే మూడు రాజధానులు బిల్లు రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసిందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
కచ్చితంగా అమిత్షాతో ముఖ్యమంత్రి జగన్ భేటీ తరువాతనే ఏపీ ఈ నిర్ణయం తీసుకుందని టాక్ వినిపిస్తోంది.
ఇక నిన్నటి నుంచి బీజేపీ నేతలు రైతులపాదయాత్ర లో పాల్గొంటున్న నేపథ్యంలో దీనికి సంబంధించి పలువురు బీజేపీ నేతలు సామాజిక మాధ్యమాల్లో హర్షం వ్యక్తం చేస్తున్నారు.