తెలంగాణ ఉద్యమం సమయంలో ఇదే ఇందిరాపార్కు వద్ధ ధర్నాలో కూర్చున్నాం. ధర్నాలో సీఎం కేసీఆర్తో పాటు, ప్రొఫెసర్ జయశంకర్, మంత్రి జగదీశ్రెడ్డిల పక్కనే ఉన్నాను. అప్పుడు వాన వచ్చినప్పుడు సీఎం కేసీఆర్ తో వాన వస్తుంది సార్ అని అడిగినా.. వాన వచ్చిన, వరద వచ్చినా ఏది వచ్చినా ఉద్యమం ఆగకూడదు. వాన వచ్చిందని వెళ్లిపోతే తెలంగాణ ఏ విధంగా వస్తుందని సీఎం కేసీఆర్ చెప్పినట్టు రసమయి బాలకిషన్ మహాధర్నాలో గుర్తు చేశారు.
అనంతరం రసమయి బాలకిషన్ మాట్లాడారు. మాటలు కాస్త పాట ద్వారా వినిపించాడు. మూడింది ఓ కేడీ.. కదిలింది కాడి.. ఆదాని అంబానీల జోడి. సామ్రాజ్యవాదుల కూడీ అన్నదాతలకు వేస్తిరి భేడీ. నకురాలు చెల్లవు కేడీ.. మా రైతులందరూ కూడీ కడుతున్నం పాడి. తెలంగాణ యాసంగి వడ్లను కొనలేమంటూ చేతులెత్తినవు. పంజాబ్లో కాంటాలు పెట్టి టన్నుల కొద్ది జోకుతున్నవు. గా బండి నోటితో ఓ మాట.. ఈ గుండుగానితో ఓ కూత. అబద్దాలతో అందరూ ఆడుతున్నరు సర్కారు నోట. టీఆర్ఎస్ తో తట్టుకోలేవు మోడి. ఒకటే దేశం.. ఒకటే మార్కెట్ అని దళారులకు పెత్తనం ఇచ్చావు. రోకళ్లను స్వాగతించినవు. విద్యుత్ సవరణల పేరుతో రైతుల మెడపై మోపు చేసావు. మూడు చట్టాలు తెచ్చి ముప్పు తిప్పలు పెడుతున్నవు. కబడ్దార్ ఓ కేడీ కదిలినాయి కాడెద్దులు. లేచిండ్రూ తెలంగాణ రైతులు. ఎండను, వానను లెక్క చేయకుండా వడ్లు కొనేదాకా ఆగదు ఈ రైతుల పోరు అంటూ రసమయి ప్రసంగం చేశారు.