నిరుద్యోగుల‌కు జ‌గ‌న్ ప్ర‌భుత్వం శుభ‌వార్త‌..!

N ANJANEYULU
ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగుల‌కు జ‌గ‌న్ ప్ర‌భుత్వం శుభ‌వార్త‌ను చెప్పింది. ఏపీలోని వైద్యారోగ్య శాఖ‌లో నూత‌న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు స‌ర్కార్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ‌లో  దాదాపు 2190 కొత్త పోస్టుల‌ను మంజూరు చేస్తూ ప్ర‌భుత్వం ఉత్త‌ర్వుల‌ను జారీ చేసింది. ప్ర‌భుత్వం ఈమేర‌కు అధికారికంగా ఓ ప్ర‌క‌ట‌న‌ను కూడా విడుద‌ల చేసింది.

దాదాపు 35 మెడిక‌ల్ క‌ళాశాల‌లు,  వాటికి అనుబంధ ఆసుప‌త్రుల‌లో 51 ప్రొఫెస‌ర్‌, 187  అసోసియేట్ ప్రొఫెస‌ర్లు, 130 అసిస్టెంట్ ప్రొఫెస‌ర్లు, 1040 న‌ర్సింగ్ పోస్టులు, 782 పారామెడిక‌ల్ పోస్టులున్నాయి. వెంట‌నే ఈ పోస్టుల‌ను భ‌ర్తీ చేయాల‌ని జ‌గ‌న్ ప్ర‌భుత్వం అధికారుల‌ను ఆదేశించింది. క‌రోనా మ‌హ‌మ్మారి విజృంబిస్తున్న నేప‌థ్యంలో వైద్య‌శాఖ‌లో ఈపోస్టుల‌ను భ‌ర్తీ చేస్తున్న‌ట్టు ప్ర‌భుత్వం స్ప‌ష్టం చేస్తోంది. ఇలాంటి కీల‌క‌మైన స‌మ‌యంలోనే వైద్యారోగ్య శాఖ‌ను బ‌లోపేతం చేయాల‌ని నిర్ణ‌యం తీసుకుంది స‌ర్కార్‌. ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యం నిరుద్యోగులు సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: