హైద‌రాబాద్‌లో మ‌రో మ‌హిళ అదృశ్యం

N ANJANEYULU
హైద‌రాబాద్ న‌గ‌రంలో మ‌రో అదృశ్యం కేసు న‌మోదైన‌ది. చిక్క‌డ‌ప‌ల్లికి చెందిన మ‌హిళా  మిస్సింగ్ ఆందోళ‌న కలిగిస్తోంది. దోమ‌ల‌గూడ‌కు చెందిన భార్గ‌వి న‌గ‌రంలోని ఓ సాప్ట్‌వేర్ కంపెనీలో ప‌ని చేస్తున్న‌ది. బ్యూటీ పార్ల‌ర్‌కు వెళ్తున్నాను అని ఇంట్లో చెప్పి బ‌య‌టికి వెళ్లిన భార్గ‌వి తిరిగి రాలేదు. కంగారు ప‌డిన కుటుంబ స‌భ్యులు ఆమె కోసం గాలింపులు చేప‌ట్టాల‌రు. ఆ  మ‌హిళ కోసం ఎంత వెతికినా ఆచూకి ల‌భించ‌క‌పోవ‌డంతో చిక్క‌డప‌ల్లి పోలీసుల‌కు ఫిర్యాదు చేసారు.

కేసు న‌మోదు చేసుకొని ద‌ర్యాప్తును వేగ‌వంతం చేస్తున్నారు చిక్క‌డ‌ప‌ల్లి పోలీసులు. ముఖ్యంగా సీసీ టీవీ దృశ్యాల‌ను ప‌రిశీలించారు. న‌గ‌రంలోని ప‌లు ప్రాంతాల్లో భార్గ‌వి న‌డుచుకుంటూ తిరిగిన‌ట్టుగా పోలీసులు సీసీ పుటేజీల ఆధారంగా ఆమె దృశ్యాల‌ను గుర్తించారు.  పంజాగుట్ట నుంచి మ‌ల‌క్‌పేట వ‌ర‌కు వెళ్లిన‌ది. త‌న వ‌ద్ద ఉన్న ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి మూసారాంబాగ్ వ‌ద్ద రోడ్డుపై ప‌డేసిన‌ట్టు గుర్తించారు పోలీసులు. భార్గ‌వికి ఏడాది క్రిత‌మే పెళ్లి జ‌రిగిన‌ది. ఆమె ఆచూకి ల‌భ్యం కాక‌పోవ‌డంతో కుటుంబ స‌భ్యులు ఆందోళ‌ణ చెందుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: