టీడీపీ నేతలపై కేసులు నమోదు..మాజీ మంత్రి ఫైర్...!
ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశాలతో కమిషనర్ చిట్టిబాబు పనిచేస్తున్నారని ఆరోపించారు. అదేవిధంగా చిత్తూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు పులివర్తి నాని కూడ కేసుల వ్యవహారంపై ఫైరయ్యారు. కుప్పంలో ప్రజాస్వామ్యబద్థంగా ఎన్నికలు జరుగుతాయనే నమ్మకం సన్నగిల్లుతోంది అని, వైసీపీ నాయకులు నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు. ప్రతిపక్ష నేతపై వైసీపీ బూతు పురాణం బాధకరం అని వెల్లడించారు. టీడీపీ నేతలకు సంస్కారంగా మాట్లాడడం మాత్రమే తెలుసు అని పేర్కొన్నారు పులివర్తి నాని.