శ్రీకాకుళం జిల్లా టెక్కలి పోలీస్ స్టేషన్ లో అచ్చెన్నాయుడు, ఎంపీ రామ్మోహన్ నాయుడు లపై కేసు నమోదు అయ్యింది. అచ్చెన్న, రామ్మోహన్ నాయుడు తో సహా 48 మంది టిడిపి కార్యకర్తలపై కేసులు నమోదు అయ్యాయి. నిన్న నందిగామలో ఎన్టీఆర్ ,ఎర్రన్నాయుడు విగ్రహాల ఆవిష్కరణ జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ కార్యక్రమానికి అచ్చెన్న రామ్మెహన్ నాయుడులు హాజరయ్యారు. అయితే ఈ సందర్భంగా భారీ ర్యాలీగా టిడిపి నేతలు వెళ్లారు.
కాగా ర్యాలీ చేసిన సంధర్బంగా కోవిడ్ నిబంధనలు ఉల్లంఘన, మోటార్ వాహన చట్టం ఉల్లంఘించారంటూ వీఆర్వో ఆరంగి మల్లేశ్వరరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉండగా ఇది వైసీపీ కుట్రేనని టీడీపీ నాయకులు కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. వైసీపీ నాయకులు సభలు సమావేశాలు ర్యాలీలలో పాల్గొంటే కరోనా నిబంధనలు అడ్డురావని అదే టీడీపీ వాళ్లు ఏం చేసినా కరోనా నిబంధనల పేరుతో కేసులు పెడుతున్నారంటూ ఆరోపించారు.