స్వామికి ఇచ్చాడ్రా భూమి..ద‌టీజ్ జ‌గ‌న్!

RATNA KISHORE
విశాఖ స్వ‌రూపానందేంద్రకు ఆయ‌న న‌డుపుతున్న శార‌దా పీఠానికి ఇంకా ఇంకొన్నింటికి జ‌గ‌న్ అత్యంత ప్రాధాన్యం ఇస్తారు. ఆ క్ర‌మంలో భాగంగానే  స్వామి విన్న‌పంలో భాగంగానే ఈ కేటాయింపులు జరిగిపోయాయి. ఈ మేర‌కు ఇవాళ ఏపీ క్యాబినెట్ నిర్ణ‌యాన్ని వెలువ‌రించింది. విశాఖ కు స‌మీపాన కొత్త‌వ‌ల‌స (విజ‌య‌న‌గ‌రం జిల్లా) లో 15 ఎక‌రాల భూమిని ఇచ్చేందుకు స‌మ్మ‌తించింది. దీంతో  ఏనాటి నుంచి జ‌గ‌న్ ను న‌మ్ముకున్న స్వామీజీకి ఇప్పుడు మంచి ప్రాధాన్యం ద‌క్కింది. వాస్త‌వానికి గ‌త కొద్దిరోజులుగా  ఇదే విష‌య‌మై వివిధ మీడియాలో చ‌ర్చోప‌చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి. స్వామీజీకి భూమి కేటాయింపుకు సంబంధించి విమ‌ర్శ‌లు రేగుతున్నాయి. కానీ అవేవీ లెక్క చేయ‌క జ‌గ‌న్ త‌న ప‌ని  తాను చేసుకుని పోవ‌డ‌మే సిస‌లు విశేషం. మ‌రోవైపు తెలంగాణ‌లో కూడా స్వామీజీ అంటే ప్రేమించే నాయ‌కులు ఉన్నారు. కేసీఆర్ కు కూడా స్వామిజీ చెప్పే మాట‌లు అంటే ఎంతో ప్రీతి. ఇప్ప‌టికే యాదాద్రి అభివృద్ధి ప‌నులు ప‌ర్య‌వేక్షించిన అధికారుల‌తో స్వామీజీ ముచ్చ‌టించి అభినందించారు కూడా! ఇక అక్క‌డ కూడా అంటే తెలంగాణ నాయ‌కుల నుంచి కూడా ఎటువంటి హామీలు పొంది భూములు పొంద‌నున్నారో చూడాలిక.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

ycp

సంబంధిత వార్తలు: