జగన్ కేసులపై తెలంగాణ హైకోర్టులో రోజువారీ విచారణ

N ANJANEYULU
ఆంధ్రప్రదేశ్ సీఎం  వైఎస్ జగన్ కు సంబంధించిన‌  అక్రమాస్తుల కేసు ఇకపై తెలంగాణ హైకోర్టులో గురువారం నుంచి  రోజువారీ విచారణ చేప‌ట్ట‌నున్నారు. ఈ కేసుకు సంబంధించి దాఖలైన రిట్ పిటిషన్లపై హైకోర్టు  రోజువారీ విచారణ చేపడతామని స్పష్టం చేసింది. ప్రజాప్రతినిధులకు సంబంధించిన వ్యాజ్యాలను త్వరగా తేల్చాలని సుప్రీం కోర్టు ఇచ్చిన‌ ఆదేశాలతో విచారణ వేగవంతం చేయ‌నుంది.

 సీబీఐ కోర్టులో వ్యక్తిగత హాజరు మినహాయింపు కోరుతూ జగన్ దాఖలు చేసిన పిటిషన్లతో సహా 2012 నుంచి దాఖలైన 40 వ్యాజ్యాలను విచారణ జాబితాలో చేర్చింది  ఉన్నత న్యాయస్థానం. కింది కోర్టు విచారణలో,   12 చార్జ్ షీట్లలో నిందితులుగా ఉన్న పలు సంస్థల వ్యక్తులు, వారిపైన‌ నమోదైన కేసులను కొట్టేయాల‌ని, స్టే ఉత్తర్వులు పొడిగించాలని కోరుతూ రిట్ పిటిషన్లు దాఖలు చేశారు. అన్నింటిపై  న్యాయమూర్తి జస్టిస్‌ షమీమ్‌ అక్తర్‌ ధర్మాసనం రోజు వారీ విచారణ చేపడతామని స్ప‌ష్టం చేసింది.
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: