ఊరు వదిలి వెళ్ళిపోతా: వైసీపీ ఎమ్మెల్యే సంచలన కామెంట్స్

టీడీపీ మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్ పై ఎమ్మెల్యే జక్కంపూడి రాజా సంచలన వ్యాఖ్యలు చేసారు. రాజానగరం నియోజకవర్గంలో రెండేళ్ల లో 500 కోట్ల అవినీతికి పాల్పడ్డానని, జక్కంపూడి ట్రస్ట్ పేరుతో 15 కోట్లు చందాలు అడుకున్నామన్న ఆరోపణలను వెంటనే పెందుర్తి వెంకటేష్ నిరూపించాలి అని ఆయన డిమాండ్ చేసారు. పెందుర్తి వెంకటేష్ సవాల్ ను స్వీకరిస్తున్నా సత్యప్రమాణానికి నేను సిద్దం అని ఆయన పేర్కొన్నారు.
నాపై చేసిన ఆరోపణలు పెందుర్తి నిరూపిస్తే ఏమీ చేయమన్నా చేస్తా అంటూ ఆయన కామెంట్స్ చేసారు. కుటుంబమంతా ఆస్తులు విడిచిపెట్టి ఊరు వదిలి వెళ్లమన్న వెళతాం అన్నారు ఆయన. పెందుర్తికి దమ్ముంటే సత్యప్రమాణానికి రావాలి అని ఆయన డిమాండ్ చేసారు. ఇప్పటికే 25 సార్లు సత్యప్రమాణానికి నేను ఆహ్వానిస్తే పెందుర్తి పారిపోయాడు అని ఆరోపించారు. పెందుర్తి ఆరోపణలు నిరూపించకపోతే సహించను అని వార్నింగ్ ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: