బ్రేకింగ్: కలకలం రేపుతున్న బెజవాడ మిస్టరీ డెత్...?

విజయవాడలో మిస్టరీ డెత్ ఇప్పుడు కలకలం రేపుతుంది. ఖరీదైన కారులో ఉన్న ఆ మృతదేహం పోలీసులకు సవాల్ గా మారింది. డీవీ మ్యానర్ హోటల్ పక్క సందులో ఆగి ఉన్న కారు డ్రైవింగ్ సీటులో కుప్పకూలిన వ్యక్తిని స్థానిక పోలీసులు గుర్తించారు. జి. కొండూరులో గ్యాస్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీకి ఓనర్ గా పోలీసులు చెప్తున్నారు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం తాడిగడప కు చెందిన కరణం రాహుల్ గా పోలీసులు గుర్తించారు.

 ఏపీ 16 ఎఫ్ఎఫ్ 9999 బ్లాక్ ఎండీవర్ కారులో మృతదేహం ఉన్నట్టుగా తెలుస్తుంది. వ్యాపారాల్లో విబేధాలు ఉన్నట్టుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి. మిస్టరీ డెత్ గా కేసు నమోదు చేసిన పోలీసులు ఆత్మహత్య లేక హత్య అన్నకోణంలో విచారిస్తున్నారు. కుటుంబ సభ్యులకు కూడా పోలీసులు ఇప్పటికే సమాచారం ఇచ్చారు. మృతదేహంపై గాయాలు లేకపోవడంతో మరిన్ని అనుమానాలు వస్తున్నాయి. పెనమలూరు పోలీస్ స్టేషన్ లో రాత్రి మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చారని
సెంట్రల్ ఏసీపీ ఖాదర్ బాషా వివరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: